ఆరు నెలలపాటు మీడియాతో మాట్లాడను: పారికర్
పనాజి: ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్.. ఆరు నెలల పాటు ప్రసార మాధ్యమాల(మీడియా)తో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు.
శనివారం గోవాలో ఒక ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన నిమిత్తం వచ్చిన ఆయన, స్వయంగా మీడియాకు ఈ విషయం వెల్లడించారు. రక్షణ శాఖ సంబంధిత కొన్ని అంశాలపై ఆయన వ్యాఖ్యను తెలుసుకోవడానికి మీడియా ప్రయత్నించినప్పుడు పై విధంగా బదులిచ్చారు.

గత 40-50 ఏళ్లలో మన దేశం ఒక యుద్ధానికీ దిగకపోవడం వల్ల భారత సైన్యం ప్రాముఖ్యం తగ్గిపోయిందంటూ ఇటీవల చెప్పడం సహా రక్షణశాఖకు చెందిన ఏ ప్రశ్నకూ సమాధానం చెప్పడానికి ఆయన నిరాకరించారు.
తీవ్రవాదుల్ని తీవ్రవాదంతోనే ఎదుర్కోవాలి, చైనాలో తయారయ్యే గణేశ్ విగ్రహాల కళ్లు చిన్నవి... ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల్ని పారికర్ ఇటీవల చేసిన విషయం తెలిసిందే. తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలోనే కొంతకాలంపాటు మీడియాతో మాట్లాడకూడదని పారికర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications