వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భీం మహాసంఘం విజయ్ సంకల్ప్ ర్యాలీ: ప్రపంచ రికార్డ్ దిశగా బీజేపీ, 5వేల కిలోల కిచిడీ వంటకం!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: 2019 లోకసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రపంచ రికార్డుతో పాటు దళిత ఓటు బ్యాంకుపై దృష్టి సారించింది. ఇందుకోసం భీమ్‌ మహా సంగమ్‌ విజయ్‌ సంకల్ప్ పేరుతో ఢిల్లీలో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించనున్నది. ఆదివారం జరగనున్న ఈ ర్యాలీలో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ఆ పార్టీ నాయకులు ఐదువేల కిలోల కిచిడీ వండుతున్నారు. దీనిని 750 కిలోల కుండలో వండుతున్నారు.

ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా అధ్యక్షతన ఈ ర్యాలీ జరుగుతోంది. దళితుల ఇళ్ల నుంచి సేకరించిన బియ్యం, ధాన్యాలతో ఈ భారీ వంటకాన్ని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో తయారు చేస్తారు. అనంతరం దీనిని అందరికీ పంచిపెడతారు. తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం దళిత సామాజిక వర్గాలకు చేస్తున్న మేలు గురించి అమిత్‌ షా మాట్లాడుతారు.

 With eye on world record and Dalit voters, BJP gets 5,000 kg of khichdi cooked for Amit Shah’s Delhi rally

నవంబరు 2017లో కూడా బీజేపీ ఇలాంటి కార్యక్రమం చేపట్టింది. ఆ సమయంలో ఆహార మంత్రిత్వశాఖ నిర్వహించిన ప్రపంచ ఫుడ్‌ ఇండియా ఫెస్టివల్‌లో భాగంగా ప్రముఖ చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌ 918 కిలోల కిచిడీని వండారు. ఇప్పుడు బీజేపీ ఏకంగా 5,000 కిలోల కిచిడీ వండనుంది.

English summary
In a bid to woo over Dalit voters as well as create a world record, the Bharatiya Janata Party (BJP) is having 5,000 kg ‘khichdi’ cooked for its ‘Bhim Mahasangam Vijay Sankalp’ rally at Ram Lila Maidan later on Sunday. The ‘khichdi’, which is being cooked with rice and lentils collected from Dalit households, is being cooked in pot weighing 750 kg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X