వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడిని దొంగిలించిందని మహిళ తల నరికేశారు

|
Google Oneindia TeluguNews

గౌహతి: అస్సాం రాష్ట్రంలోని సోనిత్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోడిని దొంగిలించిందనే కారణంగా ఓ ఆదివాసి మహిళ తలను నరికేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

సోనిత్‌పూర్ జిల్లాలోని బార్‌ఘులి ప్రాంతానికి చెందిన ఫాగుని కవారి(50) కుటుంబానికి, అదే ప్రాంతానికి చెందిన మరో కుటుంబానికి మధ్య కోళ్ల దొంగతనం అంశంపై గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

ఫాగుని కుటుంబం తమ కోళ్లను దొంగలించి విందు చేసుకుంటోందని నిందితుల కుటుంబం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులు ఓ పదునైన ఆయుధంతో ఫాగుని తల నరికి, ఆమె భర్తను తీవ్రంగా గాయపర్చారు.

 Woman Branded as 'Witch', Beheaded in Tezpur

కాగా, ఫాగుని కుటుంబసభ్యులు తమని తాము రక్షించుకునేందుకు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. కాగా, మృతురాలు మంత్రాలు చేస్తున్న నేపథ్యంలోనే హత్య జరిగిందని పలువురు పేర్కొంటున్నారు.

English summary
A woman, suspected to be a witch, was beheaded in Sonitpur district of Assam, a senior police officer said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X