భర్తను చితకబాదారు: భార్య గ్యాంగ్ రేప్, హత్య
పాల్ గడ్: భర్తను చితకబాదిన దుండగులు అతని భార్యను ఎత్తుకు వెళ్లి సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన మహారాష్ట్ర లో జరిగింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలోని పాలగడ్ జిల్లా వలీవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇటివల ఓ ఇంటికిలోకి నలుగురు నిందితులు చొరబడ్డారు. ఆ సమయంలో ఇంటిలో 35 సంవత్సరాల మహిళ, ఆమె భర్త ఉన్నారు.
తరువాత నీ భార్య మమ్మల్ని అనవసరంగా దూషించిందని, ఆమె మీద కక్ష తీర్చుకుంటామని భర్తకు చెప్పారు. అతను నిందితులను ఇంటి నుంచి బయటకు పంపించడానికి ప్రయత్నించడంతో నలుగురు పట్టుకుని భర్తను చితకబాదారు.
తరువాత ఆమెను ఎత్తుకు వెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. అంతటితో ఆమెను వదిలి పెట్టకుండా చంపేసి శవాన్ని తీసుకు వెళ్లి ఓ కాలువలో పడేసి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు గావ్ రాయ్ పద అనే ప్రాంతంలో నివాసం ఉంటున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారని పాలగడ్ జిల్లా ఎస్పీ శారద రౌత్ తెలిపారు. మహిళ పూర్తి వివరాలు సేకరిస్తున్నామని శారద రౌత్ చెప్పారు.