ఒంటరి మహిళా జర్నలిస్ట్పై స్నేహితుడు రేప్, గతంలో సహజీవనం
న్యూఢిల్లీ: 34 ఏళ్ల మహిళా జర్నలిస్టు పైన ఆమె స్నేహితుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన దేశ రాజధానిలో జరిగింది. ఆమె ఓ ఆంగ్ల న్యూస్ పేపర్లో జర్నలిస్టుగా పని చేస్తున్నారు. అతని పైన ఆమె స్నేహితుడే అత్యాచారానికి పాల్పడటం మరింత విషాదం.
ఈ అత్యాచారం కేసులో పోలీసులు 38 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగింది. అప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అతనిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
బాధితురాలికి గతంలోనే పెళ్లయింది. ఆమె తన భర్త నుండి విడాకులు తీసుకుంది. ఆమెకు ఎనిమిదేళ్ల కూతురు ఉంది. నిందితుడికి ఆమెతో దాదాపు ఆరేళ్ల క్రితం పరిచయమైంది. ఓ క్లబ్లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి వారిద్దరు స్నేహితులుగా ఉంటున్నారు.
గతంలో వీరిద్దరు సహజీవనం కూడా చేశారు. మహిళ జైపూర్కు చెందిన వ్యక్తి. ఆమె ఢిల్లీలో సెటిల్ అయ్యారు. ఆమె ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో పని చేస్తున్నారని వసంత్ కుంజ్ పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీం పని చేస్తుందని తెలిపారు.