వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫైర్: మహిళ భర్తను చంపి చెట్టుకు వేలాడదీసింది

By Pratap
|
Google Oneindia TeluguNews

Woman kills hubby, hangs him from tree
గ్రేటర్ నోయిడా: ఓ మహిళ తన భర్తను చంపి, అతని శవాన్ని చెట్టుకు వేలాడదీసింది. ఆ మహిళను పోలీసులు మంగంళవారంనాడు అరెస్టు చేశారు. అక్రమ సంబంధం కారణంగానే ఆమె భర్తను చంపిందని ఆరోపిస్తున్నారు. గ్రేటర్ నోయిడాలోని చిప్యానాలో ఈ సంఘటన జరిగింది.

హత్యలో అమెకు సహకరించిన ఆమె కజిన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తన భర్త విషయంపై పోలీసులను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేసిన కమల అనే ఆ మహిళ ఆ తర్వాత బోరున ఏడ్చేసి వాస్తవాన్ని అంగీకరించింది.

రాజ్‌కుమార్ అనే 35 ఏళ్ల వ్యక్తిని గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆ చెట్టు రాజ్‌కుమార్ ఇంటి ఆవరణలోనే ఉంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగా లేవని పోలీసులు అంటున్నారు. తాగి వచ్చి ప్రతి రోజూ ఆమెను కొడుతూ ఉండేవాడని అంటున్నారు.

సోమవారంనాడు బాగా తాగి వచ్చిన రాజ్‌కుమార్ భార్యను కొట్టాడు. దాంతో ఎదురు తిరిగి ఆమె అతన్ని చంపేసింది. చెట్టుకు వేలాడదీయడంలో పుష్పేంద్ర తనకు సహకరించినట్లు కమల చెప్పింది. పుష్పేంద్రతో సంబంధం వల్లనే కమల ఈ హత్యకు పాల్పడిందని రాజ్‌కుమార్ బంధువులు ఆరోపిస్తున్నారు.

English summary

 A woman was arrested on Tuesday for murdering her husband after the man's body was found hanging from a tree at Chipyana in Greater Noida. The man's cousin was also arrested for allegedly helping the woman commit the crime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X