పదహారేళ్ల బాలికను ఎత్తుకెళ్లి రేప్, రాత్రి వదిలేశారు
లక్నో: ఓ యువకుడు పదహారేళ్ల యువతిని అపహరించి, అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బాఘ్పట్లోని రమల ప్రాంతంలో జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు చెప్పారు. బాలికను అపహరించి, అత్యాచారం చేసిన నిందితడి పేరు ఆరీఫ్గా తెలుస్తోంది.
అతను మంగళవారం నాడు ఆమెను అపహరించాడు. అక్కడి నుండి ఎవరు లేని ఓ ఇంటికి తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమె పైన అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడి వయస్సు 25 ఉంటుంది. బాలిక పక్కనే ఉన్న ఓ గ్రోసరీ షాప్కు వెళ్తుంటే అతను ఎత్తుకెళ్లాడు.
అత్యాచారం చేసిన అనంతరం బాలికను రాత్రిపూట వదిలేశాడు. ఇంటికి వెళ్లిన బాలిక సంఘటన గురించి తల్లిదండ్రులకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరీఫ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిని బుధవారం నాడు అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.
మైనర్ బాలిక కిడ్నాప్
ఫరిదాబాదులో 13 ఏళ్ల మైనర్ బాలిక కిడ్నాప్కు గురైంది. ఆమెను ముగ్గురు యువకులు అపహరించినట్లుగా పోలీసులు చెప్పారు. బాలిక మామ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు... బాలిక తన సోదరిని చూసేందుకు వెళ్తుండగా సెక్టార్ 25 బలాద్గార వద్ద ముగ్గురు యువకులు ఆమెను అపహరించారు. నిందితులను శంషుద్దీన్, ఆస్మా, దేవేంద్రలుగా పేర్కొన్నారు. వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఇదిలా ఉండగా, జిల్లాలో 24 ఏళ్ల యువతి పైన ఇద్దరు యువకులు మంగళవారం ఆత్యాచారం చేశారు.