ఫుట్బాల్ స్టేడియం బయట జంట పేలుళ్లు: 29 మంది మృతి
ఇస్తాంబుల్లో సాకర్ స్టేడియం వెలుపల బాంబులు పేలాయి. జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 29 మంది మృతి చెందారు. 166 మందికి పైగా గాయపడ్డారు.
ఇస్తాంబుల్: ఇస్తాంబుల్లో సాకర్ స్టేడియం వెలుపల బాంబులు పేలాయి. జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 29 మంది మృతి చెందారు. 166 మందికి పైగా గాయపడ్డారు. ఫుట్బాల్ మ్యాచ్ అనంతరం అందరు ఇళ్లకు చేరుకుంటున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
టర్కీ ముఖ్య నగరమైన ఇస్తాంబుల్లో శనివారం రాత్రి ఈ పేలుళ్లు సంభవించాయి. మృతుల్లో ఎక్కువమంది పోలీసులు ఉన్నట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ తెలిపారు. పోలీసులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు వెల్లడించారు.

తొలి పేలుడు ఫుట్బాల్ స్టేడియం బయట, రెండోది ఓ పార్క్ ఆవరణలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పదిమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తొలి దాడిలో కారు బాంబును దుండగులు వినియోగించగా, రెండో ఘటనలో ఆత్మహుతి దాడిగా పోలీసులు భావిస్తున్నారు.
తొలి పేలుడు బెసిక్తాస్ ఫుట్బాల్ స్టేడియం బయట చోటు చేసుకుంది. తొలి పేలుడు జరిగిన 45 సెకండ్లకు రెండో పేలుడు సంభవించింది. ఇది మక్కా పార్క్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ రెండు పేలుళ్లకు సంబంధం ఉండి ఉంటుందని భావిస్తున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications