వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రిస్మస్ విషాదం: విష మద్యం సేవించి 32మంది మృతి

క్రిస్మస్ వేడుకల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్‌లో విష మద్యం సేవించి 32 మంది మరణించారు.

|
Google Oneindia TeluguNews

లాహోర్‌: క్రిస్మస్ వేడుకల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్‌లో విష మద్యం సేవించి 32 మంది మరణించారు. 60 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. టోబా టెక్‌ సింగ్‌ నగరంలోని ముబారకాబాద్‌ క్రైస్తవ కాలనీలో ఆ ఘటన చోటు చేసుకుంది.

క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా గత శనివారం వీరంతా మద్యాన్ని సేవించారు. మరుసటి రోజు ఉదయానికి కొందరు మరణించగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని స్థానిక పోలీసులు తెలిపారు.

32 people die after consuming toxic liquor in Pakistan

ఇప్పటికీ పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారని తెలిపారు. ఘటనకు కారకులైన తండ్రీకొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తుకు విచారణ కమిటీని నియమించారు.

కాగా, పాక్‌లో ముస్లింలకు మద్యం అమ్మకం, వినియోగాలపై నిషేధం ఉండగా, మైనారిటీలు, విదేశీయులకు పలు కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. కాగా, గత మార్చిలో హోలీ వేడుకల్లో భాగంగా కల్తీ మద్యాన్ని సేవించడంతో 45 మంది మరణించిన విషయం తెలిసిందే. వీరిలో 35 మంది హిందువులున్నారు.

English summary
At least 32 people, mostly Christians, have died and nearly 50 others fell sick after consuming illegally-brewed toxic liquor on Christmas eve in a town in Pakistan's Punjab province, officials said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X