ఫిలిప్పీన్స్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం: 37మంది మృతి
మనీలా: ఇప్పటికే తుఫానుతో అతలాకుతలమవుతున్న ఫిలిప్పీన్స్లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలిప్పీన్లోని దెవావో నగరంలో ఓ షాపింగ్ మాల్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడ 37 మంది మరణించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.
కాగా, షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమవడంతో వీరంతా బతికుండే అవకాశంలేదని ఆ దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్ట్ తెలిపారు. శనివారం ఉదయం భవనం మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడగా.. వీటిలో 37 మంది చిక్కుకుపోయారని పేర్కొన్నారు. బాధితుల్లో అమెరికాకు చెందిన ఓ కాల్ సెంటర్ సిబ్బందీ ఉన్నారని కథనాలు పేర్కొన్నాయి.

ఇది ఇలావుండగా, దక్షిణ ఫిలిప్పీన్స్లో తుఫాను దాటికి బలైనవారి సంఖ్య 200కు మించిపోయింది. గల్లంతైన వారి సంఖ్యా 160కి చేరింది. మిందానావో ద్వీపంలో టెంబిన్ తుపాను వల్ల నదులు ఉప్పొంగుతున్నాయని, కొండచరియలూ విరిగిపడుతున్నాయని పోలీసులు ఆదివారం తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల్లోని 40,000 మందిని ప్రత్యేక శిబిరాలకు తరలించామని తెలిపారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications