దారుణం: ప్రియుడితో వెళ్లిందని రాళ్లతో కొట్టిచంపారు
కాబుల్: ఆఫ్ఘనిస్థాన్లోని ఘల్మీన్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతికి కుటుంబసభ్యులు ఇష్టం లేని పెళ్లి చేశారు. దాన్ని కాదనలేక ఓ మహిళ మరో అబ్బాయితో వెళ్లిపోయింది. దీంతో విషయం తెలుసుకున్న ఉగ్రవాదులు.. ఆమెను పట్టుకుని రాళ్లతో కొట్టి చంపారు.
దీనికి సంబంధించిన వీడియో స్థానిక మీడియాలో ప్రసారం అయ్యింది. రోఖ్సానా అనే మహిళ ఉగ్రవాదుల రాళ్లదాడిలో ప్రాణాలు కోల్పోయింది. 30సెకండ్ల నిడివి ఉన్న వీడియోలో ఆమె స్థానిక మత పద్ధతులకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఈ ఘటనను అధికారులు కూడా దృవీకరించారు.
రోఖ్సానా అనే మహిళ.. తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన రాళ్ల దాడిలో చనిపోయిందని ఆ ప్రాంత గవర్నర్ జయేండా తెలిపారు. కుటుంబసభ్యులు బాధితురాలికి ఇష్టంలేని వివాహం చేసినందువల్లే ఆమె, తన ప్రియుడితో వెళ్లిపోయిందని ఆమె చెప్పారు.
ఆమెపై దాడిని జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఘటనపై తీవ్రంగా స్పందించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.