యురేనియం సరఫరా: ఆస్ట్రేలియా ఓకే
సిడ్నీ: భారత్ కు యురేనియం సరఫరా చెయ్యడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. భారత్ కు యురేనియం సరఫరా చేసే విషయంలో ఆస్ట్రేలియా-భారత్ గత 8 సంవత్సరాల నుంచి సుధీర్ఘంగా చర్చిస్తున్నది.
ఆస్ట్రేలియా-భారత్ అణు సహకార ఒప్పందం కుదిరిందని, ఇది తక్షణం అమలులోకి వస్తుందని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్ ప్రకటించారు. భారత్ లో పెరుగుతున్న విద్యుత్ అవసరాల మేరకు విద్యుత్ ఉత్పత్తికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదం చేయనుందని అన్నారు.

భారతదేశానికి యురేనియం సరఫరా చెయ్యడానికి గతంలో ఆస్ట్రేలియా సుముఖంగా ఉండేది. అయితే న్యూక్లియర్ అణు నిరాయుధాకరణ ఒప్పందంపై సంతకం చెయ్యడానికి భారత్ నిరాకరించడంతో కథ అడ్డం తిరిగింది.
తరువాత ఆస్ట్రేలియాలో ప్రభుత్వాలు మారడం తదితర కారణాల వలన యురేనియం సరఫరా చేసే విషయంలో 8 సంవత్సరాలు వేచి చూడవలసి వచ్చింది. అయితే ఇప్పుడు భారత్ తో పాటు యూఏఈతో యురేనియం సరఫరా చెయ్యడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియన్ కంపెనీలు భారత్ తో యురేనియం వ్యాపారం చెయ్యడానికి ఓ చక్కటి అవకాశం చిక్కింది.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications