సరిహద్దుల్లో చైనా సైన్యం కుయుక్తులకు మద్దతు-కొత్త సరిహద్దు చట్టానికి డ్రాగన్ ఆమోద ముద్ర
భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు మొదలై ఏడాది దాటిపోయింది. అయినా ఇప్పటికీ అక్కడ ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఓవైపు ఇరుదేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నా మరోవైపు మోహరింపులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇలాంటి తరుణంలో చైనా బలగాల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్ తో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైన్యం ప్రదర్శిస్తున్న దూకుడు చర్యలకు మద్దతునిచ్చేలా అక్కడి జిన్ పింగ్ సర్కార్ కొత్తగా సరిహద్దు చట్టాన్ని తీసుకొచ్చింది. చైనా సైన్యానికి అపరిమితాధికారాలు కల్పించేలా రూపొందించిన ఈ చట్టానికి జిన్ పింగ్ సర్కార్ తాజాగా ఆమోద ముద్ర వేసింది. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చైనా సర్కార్ ప్రకటించింది. ఇది తమ భూభాగాన్ని కాపాడుకోవడంతో పాటు చైనా భూభాగంపై విదేశాల అభ్యంతరాలను ఎదుర్కొనేందుకు అమల్లోకి తెస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది.

చైనా పార్లమెంటు జనవరి 1 నుండి అమలులోకి వచ్చేలా కొత్త సరిహద్దు చట్టాన్ని ఆమోదించింది, ఇది భూభాగాన్ని రక్షించడానికి, చైనా భూభాగాలపై విదేశాల అభ్యంతరాలను చర్యలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం, మిలిటరీకి అవకాశం కల్పించేలా రూపొందించింది. భారత్ తో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దూకుడు చర్యలు మొదలైన వెంటనే ఈ చట్టం ప్రతిపాదనలు కూడా ప్రారంభమయ్యాయి. ఏడాదిగా ఈ చట్టానికి పదునుపెడుతున్న చైనా సర్కార్.. ఇప్పుడు అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది.
భారత్, భూటాన్లతో చైనాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. కొత్త చట్టం, భారతదేశం, భూటాన్తో వివాదాస్పద భూభాగాలలో చైనా చర్యలను అధికారికం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇందులో భారతదేశ సరిహద్దు వెంబడి ఫార్వర్డ్ ప్రాంతాల్లో చైనా సైనిక దళాలను మోహరించడం, వాస్తవాధీన రేఖలో అతిక్రమణలు, కొత్త "సరిహద్దు నిర్మాణం వంటివి ఈ సరిహద్దు చట్టంలో ఉన్నాయి
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications