మారని డ్రాగన్ తీరు: ఇండియన్ గ్రేజియర్లను ముందుకెళ్లనీయని చైనా..
డ్రాగన్ తీరు మారడం లేదు. వాస్తవాధీన రేఖ వెంబడి దుందుకుడు చర్యలకు దిగుతుంది. తూర్పు లడాఖ్ వద్ద ఇప్పటికీ సిచుయేషన్ ఏమీ మారలేదు. డెమ్ చోక్ వద్ద భారతీయ గ్రేజియర్లను ముందుకు వెళ్లనీయడం లేదు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
Recommended Video
డెమ్ చోక్లో గల సీఎన్ఎన్ జంక్షన్లో ఉన్న సాడిల్ పాస్ సమీపంలో గల ఎల్ఏసీలో భారతీయ గ్రేజియర్లు ఉన్నారు. అయితే చైనా దళాలు తమ ఉనికి చాటుకునేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సంబంధం లేకున్నా నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇంతటి ఉద్రిక్త పరిస్థితిలో కూడా భారత్- చైనా మధ్య ఫేస్ టు ఫేస్ ఘర్షణ జరగలేదు. ఇరువర్గాల నుంచి ఇలాంటి అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయి. అంతేకాదు ఇష్యూ వచ్చిన తర్వాత భారత్ సైనిక కమాండర్లు.. చైనా అధికారులతో సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరిపారని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. 2020 నుంచి రెండు పాయింట్ల వద్ద భారత్- చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే.