Great Offer To Employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన అడ్వర్టైజింగ్ కంపెనీ.. ఏకంగా 14 రోజులు..
సాధారణంగా కంపెనీలు ఆదాయం పెంచుకోవడానికి ఖర్చులు తగ్గిస్తారు. కొన్ని కంపెనీలైతే ఉద్యోగులకు తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటాయి. సరిగా సెలవులు కూడా ఇవ్వవు. కానీ ఉద్యోగులను బాగా చూసుకునే కంపెనీలు కూడా ఉంటాయి. ఎంత బాగా అంటే వారిని సోంత డబ్బుతో విదేశాలకు విహారయాత్రకు పంపించేంతగా.. అవును ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఎంజాయ్ చేయడానికి డబ్బులిచ్చి విదేశాలకు పంపాయి. అదీ ఏకంగా వరుసగా 14 రోజులు. అయితే, ఇది పూర్తిగా సెలవు కాదు. ఒక వర్కింగ్ ట్రిప్. అంటే ఎంజాయ్ చేస్తూనే వర్క్ కూడా చేయాలన్నమాట.
ఎంజాయ్ చేస్తూ వర్క్
ఆస్ట్రేలియాకు చెందిన అడ్వర్టైజింగ్ కంపెనీ సూప్ ఏజెన్సీ తమ ఉద్యోగులందరినీ ఒకేసారి విహారయాత్రకు తీసుకెళ్లింది. అదీ ఏకంగా వరుసగా 14 రోజులు. అదీ కంపెనీ సొంత ఖర్చులతో. వారిని ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ద్వీపం బాలికి తీసుకెళ్లింది. ఉబుద్లోని అత్యంత విలాసవంతమైన విల్లాను అద్దెకు తీసుకొని ఉద్యోగులకు అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ను అందించింది ఆ కంపెనీ. అయితే ఈ ట్రిప్ ఉద్యోగులు ఎంజాయ్ తోపాటు వర్క్ కూడా చేయాలి.

వీడియో వైరల్
విహారయాత్రలో ఉద్యోగులందరూ కలిసి సరదాగా గడుపుతున్న ఓ వీడియోను కంపెనీయే స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైకింగ్, స్నోర్కెలింగ్, స్విమ్మింగ్, క్వాడ్ బైకింగ్ వంటి ఆటవిడుపులతో ఉద్యోగులు సరదాగా గడుపుతూ పనిచేయడం వీడియోలో చూడొచ్చు. బలమైన ఉద్యోగుల బృందాన్ని నిర్మించుకోవడానికి ఇలాంటి వాతావరణాన్ని అందించడం అవసరమని కంపెనీ ఎండీ కాత్యా వకులెంకో అన్నారు.












Click it and Unblock the Notifications