వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు అమెరికా మరో షాక్: డ్రోన్ల వ్యాపారానికి భారీ దెబ్బ

చైనాకు మరోసారి అమెరికా షాకిచ్చింది.సైబర్‌ ముప్పు పొంచి ఉందనే కారణంగా చైనాకు చెందిన డీజేఐ సంస్థ డ్రోన్లను వాడకూడదని అమెరికా సైన్యం నిర్ణయించింది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: చైనాకు మరోసారి అమెరికా షాకిచ్చింది. సైబర్‌ ముప్పు పొంచి ఉందనే కారణంగా చైనాకు చెందిన డీజేఐ సంస్థ డ్రోన్లను వాడకూడదని అమెరికా సైన్యం నిర్ణయించింది. ఈ క్రమంలో చైనా సంస్థ ఎస్‌జడ్‌ డీజేఐ టెక్నాలజీ కంపెనీకి చెందిన ఈ డ్రోన్ల వాడకాన్ని నిలిపివేయాలంటూ ఆ దేశ సైన్యాధికారులకు ఆదేశాలు జారీచేసింది.

'ఆ డ్రోన్ల వినియోగాన్ని నిలిపివేయండి. డీజేఐ అప్లికేషన్లను అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకోండి. బ్యాటరీ, స్టోరేజ్‌ మీడియా తదితర విభాగాలను తొలగించండి. తమ ఆదేశానుసారం సురక్షితమైన పరికరాలను అమర్చుకోండి'అని ఆగస్టు 2న రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొంది. ఇప్పటికే అమెరికా అధికమొత్తంలో ఈ కంపెనీకి చెందిన పరికరాలను వాడుతున్నట్టు సదరు లేఖ వెల్లడిస్తోంది.

Cyber Concerns Prompt Army to Stop Using Chinese-made Drones

కాగా, డీజేఐకు సంబంధించిన ఈ డ్రోన్‌ యంత్ర పరికరాలతో సైబర్‌ ముప్పు పొంచి ఉందని ఆర్మీ రీసెర్చి లేబోరేటరీ, నేవీ ఇచ్చిన సమాచారం మేరకు అమెరికా సైన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికా సైన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై డీజేఐ సంస్థ స్పందించింది.

డీజేఐ డ్రోన్లపై నిబంధనలు విధించే ముందు తమను కనీసం సంప్రదించకపోవడం బాధించిందని పేర్కొంది. అంతేగాకుండా అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపింది. సైబర్‌ ముప్పు పొంచి ఉందనే ఆరోపణలపై అమెరికా ఆర్మీని వివరణ కోరనున్నట్టు డీజేఐ ప్రతినిధులు తెలిపారు.

English summary
The U.S. Army has ordered its members to stop using drones made by Chinese manufacturer SZ DJI Technology Co Ltd because of “cyber vulnerabilities” in the products.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X