అభ్యంతరకర ఎఫ్బీ పోస్టు: హిందూ గ్రామానికే నిప్పంటించారు
ఢాకా: బంగ్లాదేశ్లో శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి.. ప్రొఫెట్ మహ్మద్పై సోషల్మీడియాలో అభ్యంతకర పోస్టు చేశాడనే నెపంతో ఆ వ్యక్తి ఉండే మొత్తం గ్రామానికే దుండగుల గుంపు నిప్పు అంటించింది.
వివరాల్లోకి వెళితే.. హిందూ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రొఫెట్ మహ్మద్ను ఉద్దేశించి ఫేస్బుక్లో అభ్యంతకరంగా పోస్టు చేశాడు. ఆ పోస్టు కాస్తా వైరల్గా మారింది. దీంతో ఆగ్రహించిన కొందరు గుంపుగా వచ్చి.. పోస్టు చేసిన వ్యక్తి గ్రామానికి వెళ్లి ఊళ్లోని దాదాపు అన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు.

ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్ధలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో టియర్ గ్యాస్ షెల్స్, రబ్బర్ బుల్లెట్లను వినియోగించారు.
కాగా, అప్పటికే గ్రామంలోని 30కి పైగా ఇళ్లు కాలిబూడిదయ్యాయి. పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించడంపై దాడికి పాల్పడిన గుంపులోని వ్యక్తులే రంగ్పూర్-దినాజ్పూర్ హైవేపై రాస్తారోకోకు దిగడం గమనార్హం. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ మొత్తం ఘటనపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ?












Click it and Unblock the Notifications