కాంగోలో నౌక మునక: 129మంది మృతి
కాంగో: కాంగో ప్రజాస్వామ్య రిపబ్లిక్ (డిఆర్ కాంగో)లో తంగాన్యికా నదిలో నౌక మునిగి 129మంది దుర్మరణం చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం వేకువజామున జరిగిన ఈ దుర్ఘటన వివరాలను ఆదివారం స్థానిక అధికారులు వెల్లడించారు.
నీట మునిగిపోయిన 129మంది మృత దేహాలను వెలికి తీసినట్టు తెలిపారు. ఈ సంఘటనలో 26మందే మరణించారని తెలిపిన స్థానిక ప్రభుత్వం నౌకలో ఉన్న అందరూ మరణించినట్టు ధ్రువీకరించింది. నౌక మునగిపోవడానికి అధిక బరువు కారణమని తెలుస్తోంది.

తరచూ ఇలాంటి ఘటనలు ఇక్కడ చోటు చేసుకుంటాయని స్థానికులు చెబుతున్నారు. లైఫ్ జాకెట్లు కూడా సరిగా లభ్యం కావని, దీంతో ఈత రాని వారు నీటిలో మునిగితే ప్రాణాలు కోల్పావాల్సిందేనని చెబుతున్నారు. నౌకలో మొత్తం 232మంది ఉన్నట్లు సమాచారం.
ఈజిప్టులో 13 మంది జాలర్ల మృతి
కైరో: గల్ఫ్ ఆఫ్ సూయజ్లో ఈజిప్టు జాలర్ల నౌకను కువైట్కు చెందిన కంటెయినర్ షిప్ ఢీకొన్న ఘటనలో 13 మంది జాలర్లు మృతిచెందగా, అనేక మందిని రక్షించారు.
కైరోకు దక్షిణాన 360 కిలోమీటర్ల దూరంలో గల్ఫ్ ఆఫ్ సూయజ్లోని రాయిస్ ఘారిబ్ ప్రాంతంలో సంఘటన చోటుచేసుకుంది. ఇటలీ ఓడరేవు నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా వైపు వెళ్తున్న నౌక.. 40 మందితో వస్తున్న ఈజిప్టు జాలర్ల బోటును ఢీకొట్టింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications