Earthquake : ఫిజీ, టోంగా దేశాల్ని కుదిపేసిన భూకంపం- రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత
దక్షిణ పసిఫిక్ సముద్ర దీవుల్లో భాగమైన ఫిజీ, టోంగాల్ని ఇవాళ భూకంపం వణికించింది.ఇక్కడ భూకంపాలు సహజమే అయినా ఇవాళ అత్యంత తీవ్రతతో కూడిన భూకంపం రావడంతో జనం వణికిపోయారు. రిక్టర్ స్కేలుపై ఇది 6.8గా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దీని తీవ్రత 5.3గా కూడా నమోదైనట్లు తెలుస్తోంది. అయితే భూకంప కేంద్రం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.
ఫిజీతో పాటు టోంగా ద్వీపదేశాల్ని ఈ భూకంపం వణికించింది. స్ధానిక కాలమానం ప్రకారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఈ భూకంపం ఇరుదేశాల్ని వణికించింది. 330 దీవుల సముదాయమైన ఫిజీ దేశంలోని పశ్చిమ దీవుల్లో ఈ భూకంపం ప్రభావం ఎక్కువగా కనిపించింది. దీని పొరుగునే ఉన్న టోంగా దీవుల్లోనూ భూకంపం ప్రభావం కనిపించింది. దీంతో ఓ దశలో సునామీ హెచ్చరికలు కూడా చేసేలా కనిపించినా ఆ తర్వాత పరిస్ధితి శాంతించినట్లు తెలుస్తోంది.

దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో భూకంపాలు సహజమే అయినా ఇక్కడ అత్యంత తీవ్రతతో కూడిన భూకంపాలు వచ్చినప్పుడు సునామీ హెచ్చరికలు కూడా విడుదల చేస్తుంటారు. సముద్రం మధ్యలో ఉన్న దీవులు కావడంతో భూకంపాలతో పాటు సునామీ ప్రమాదం కూడా వీటికి పొంచి ఉంటుంది. గతంలో ఫిజీ దీవుల్లో ఇలాంటి హెచ్చరికలు పలుమార్లు విడుదల చేశారు కూడా. ఈసారి మాత్రం సునామీ స్ధాయిలో భూకంపం రాలేదని తెలుస్తోంది. దీంతో అక్కడి జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే భూకంపం ప్రభావంతో ఆస్తి నష్టం మాత్రం జరిగినట్లు సమాచారం.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications