బద్దలైన అగ్నిపర్వతం: విమానాలు బంద్
జకార్తా: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. ఈ దెబ్బతో పలు ఎయిర్ పోర్టులను మూసివేశారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు నానా ఇబ్బంది పడ్డారు. అయితే శుక్రవారం రాత్రి పరిస్థతి అదుపులోకి వస్తుందని ఎయిర్ లైన్స్ అధికారులు అంటున్నారు.
శుక్రవారం ఇండోనేషియాలోని తూర్పూ జావాలో అగ్ని పర్వతం బద్దలైంది. విషయం గుర్తించిన ఇండోనేషియా ఎయిర్ లైన్స్ అధికారులు లంబాక్, బాలి, జంబర్, బన్ యూవాంగి ఎయిర్ పోర్టులను మూసివేస్తున్నామని ప్రకటించారు.

ప్రయాణికులకు వీలుగా ఇదే విషయం ట్విట్ చేశారు. అప్పటికే ఎయిర్ పోర్టులు చేరుకున్న ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. వెనక్కి తిరిగి వెళ్లలేక ఎయిర్ పోర్టులోనే మకాం వేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నామని ఎయిర్ లైన్స్ అధికారులు ప్రకటించారు.
తరువాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీుసుకుంటామని అధికారులు తెలిపారు. అగ్ని పర్వతం బద్దలు కావడంతో విపరీతమైన బూడిద ఆకాశాన్ని తాకింది. అందు వలన ఈ నాలుగు ఎయిర్ పోర్టు ల నుండి సర్వీసులను రద్దు చేశారు. మిగిలిన ఎయిర్ పోర్టుల నుండి విమానా సర్వీసులు సంచరిస్తున్నాయని అధికారులు తెలిపారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications