ఉక్రెయిన్ వార్ లో భారీ ఎదురుదెబ్బలు-తొలిసారి అంగీకరించిన రష్యా-తీవ్ర విషాదమని వెల్లడి
ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలుపెట్టి నెలన్నర రోజుల్లో రష్యాకు భారీగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఇంత సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఇప్పటికీ చెప్పలేని పరిస్ధితి. దీనంతటికీ కారణం ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న తీవ్ర ప్రతిఘటనే. దీన్ని రష్యా తొలిసారి అంగీకరించింది.
ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాల్లో కఠినమైన ప్రతిఘటనను ఎదుర్కొన్న రష్యా తన దండయాత్రపై పూర్తి వివరాలు గోప్యంగా ఉంచుతూ వచ్చింది. ఇప్పుడు తొలిసారిగా అత్యంత భయంకరమైన అంచనాల్ని ప్రకటించింది. ఈ యుద్ధంలో తమ సైనికులు భారీగా నష్టపోయినట్లు వెల్లడించింది. దీన్నో భారీ విషాదంగా అభివర్ణించింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పెరుగుతున్న మరణాల సంఖ్యపై విచారం వ్యక్తం చేశారు. తాము భారీగా బలగాల్ని కోల్పోతున్నట్లు ఆయన విచారం వ్యక్తంచేశారు. ఇది తమకు తీవ్ర విషాదమన్నారు.

Recommended Video
మాస్కో ఆరు వారాల సుదీర్ఘ దండయాత్రలో 4 మిలియన్లకు పైగా ప్రజలు విదేశాలకు పారిపోయారు. వేలాది మంది మరణించడమో, గాయపడటమో జరిగింది. నగరాలు శిధిలాలుగా మారాయి. అలాగే రష్యన్ నేతలు, కంపెనీలపై ఆంక్షల కత్తి వేలాడుతోంది. దీన్నో ప్రతీకాత్మక చర్యగా పరిగణిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ రష్యాను మానవ హక్కుల మండలి నుండి సస్పెండ్ చేసింది. ఉక్రెయిన్ లో మానవ హక్కుల ఉల్లంఘన, మానవతా సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ తర్వాత రష్యా కౌన్సిల్ నుంచి వైదొలిగింది. మరోవైపు ఉక్రెయిన్ లో తమ దాడి కోరుకున్నంత త్వరగా ముందుకు సాగడం లేదని మాస్కో ఇప్పటికే అంగీకరించింది.
పాశ్చాత్య ఆంక్షల కారణంగా రష్యా మూడు దశాబ్దాల పాటు అత్యంత క్లిష్ట ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటుందని ప్రధాన మంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ ప్రకటించారు. యూఎస్ కాంగ్రెస్ దాని అత్యంత అభిమాన దేశం వాణిజ్య హోదాను తొలగించడం మరో దెబ్బగా మారుతోంది. ఉక్రెయిన్ను సైన్యాన్ని నిర్వీర్యం చేయడానికి ఫిబ్రవరి 24న తాము "ప్రత్యేక సైనిక ఆపరేషన్" ప్రారంభించామని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్, దాని పాశ్చాత్య మిత్రులు దానిని తప్పుడు సాకుగా చూపి తిరస్కరించారు. దీంతో రష్యాకు ఇబ్బందులు తప్పడం లేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications