Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాక్ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర దాడి: 30కి చేరిన మృతులు

లాహోర్: పెషావర్‌లోని పాకిస్ధాన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌ను లక్ష్యంగా చేసుకొని పది మంది ఉగ్రవాదులు భారీ దాడులకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పాకిస్థాన్ మిలిటరీ ఉగ్రవాదుల దాడిని సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు.

ఇప్పటి వరకు ఈ ఘటనలో 30 మంది మృత్యువాత పడినట్లు పాకిస్థాన్ మిలిటరీ అధికారులు తెలిపారు. పాకిస్థాన్ మిలిటరీ, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో పదమూడు మంది ఉగ్రవాదులు హతమవగా, 17 మంది సాధారణ పౌరులున్నారు.

Gunmen attack Pakistan air force base in Peshawar

వీరంతా ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఉన్న మసీదులో ప్రార్ధనలు చేసుకోవడానికి వచ్చారు. 8 మంది పాక్ సైనికులతో సహా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

గత కొన్ని వారాలుగా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. ఘటనకు సంబంధిచిన వివరాలను పాకిస్థాన్ అధికారులు వెల్లడించారు. పది మంది ఉగ్రవాదులు పెషావర్‌కు వాయవ్య దిశగా ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్‌లోకి చొరబడ్డారు.

నేరుగా గార్డు రూం వద్దకు వెళ్లిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే మిలిటరీ బలగాలు ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడని తెలిపారు. ఈ ఉగ్రదాడులకు పాల్పడింది తామేనని తెహ్రిక్-ఇ-తాలిబన్ ఉగ్రవాద సంస్ధ ప్రకటించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+