బ్రెగ్జిట్ ఫలితాలు: ఏ గంటకు ఏం జరిగింది?, ఈయూ నుంచి బ్రిటన్ ఔట్
లండన్: గత నాలుగు దశాబ్దాలుగా ఐరోయా యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో కలిసి ఉన్న బ్రిటన్ ఇప్పుడు దాని నుంచి వైదొలిగింది. గురువారం నిర్వహించిన రిఫరెండంతో బ్రెగ్టిట్ (బ్రిటన్ ఎగ్జిట్)కు అనుకూలంగా ఉన్నామంటూ 51.9 శాతం మంది ప్రజలు కోరుకుంటే 48.1 శాతం మంది ప్రజలు ఈయూలోనే ఉండాలని తమ మద్దతు ప్రకటించారు.
ఈ నిర్ణయంతో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం ఖాయమైంది. ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి బ్రెగ్జిట్కు మద్దతుగా, వ్యతిరేకంగా హోరాహోరీగా ప్రచారం చేశారు. రెఫరెండంకు ముందు రోజున బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ మాట్లాడుతూ బ్రెగ్జిట్ వైపు మొగ్గు చూపితే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టేనని హెచ్చిరించినా బ్రిటన్ వాసులు పట్టించుకోలేదు.
పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని బ్రెగ్జిట్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేసినా ప్రజలు పెడచెవిన పెట్టారు. ఈయూలో కొనసాగాలా వద్దా? అన్న దానిపై గురువారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ను నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈయూ నుంచి బ్రిటన్ ఔట్: విడిపోదామన్న మెజార్టీ ప్రజలు, ట్రేడింగ్ నిలిపివేసిన జపాన్

భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. శుక్రవారం మధ్యాహ్నం 11.30 నిమిషాలకు తుది ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఈయూలో కొనసాగాలని కోటి 49 లక్షల మంది ప్రజలు ఓటేయగా, వైదలగాలని కోటి 59 లక్షల మంది ఓటేశారు.
బ్రెగ్జిట్లో ఫలితాల వెల్లడిలో రెండు వర్గాల మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ ఈయూ నుంచి వైదొలగాలనే బ్రిటన్ ప్రజలు నిర్ణయించారు. యూరోపియన్ యూనియన్ కూటమిలో మొత్తం 28 దేశాలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈయూ నుంచి వైదొలగే మొట్టమొదటి దేశంగా బ్రిటన్ నిలిచింది.
బ్రెగ్జిట్ ఎఫెక్ట్, రాజకీయాల్లో కుదుపు: కామెరూన్ రాజీనామా!
బ్రెగ్జిట్ ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠను కలిగిస్తూ గంట గంటకు తారుమారయ్యాయి. భారత కాలమానం ప్రకారం ఫలితాల విశ్లేషణ ఈ విధంగా ఉంది.
ఉదయం 6.30 గంటలు
ఈ సమయంలో ఈయూ మద్దతుదారులు, ఈయూ వ్యతిరేకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. విడిపోవాలని కోరుకునే వారి సంఖ్య కొంచెం ఆధిక్యంలో ఉంది. తొలి ఫలితం సండర్లాండ్ నుంచి వెలువడగా, ఇక్కడ 82,394 మంది విడిపోవాలని, 51,930 మంది కలిసి కొనసాగాలని ఓట్లు వేశారు.
7:30గంటలు
ఈ సమయంలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠకు తెరలేపింది. ఇద్దరి మధ్యా వ్యత్యాసం భారీగా పెరిగింది. ఈయూ నుంచి వైదొలగాలనుకునే వారి సంఖ్య బాగా పెరిగింది.
8:30 గంటలు:
ఈ సమయంలో వెల్లడైన ఫలితాలను చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. బ్రెగ్జిట్కు పూర్తిగా మద్దతు తెలిపారు. దీంతో ఈ సమయంలో ఈయూ నుంచి వైదొలగాలనే వారి సంఖ్య వేల నుంచి లక్షలకు చేరింది.
9:30గంటలు:
ఈ సమయంలో ఈయూ నుంచి వైదొలగాలనుకునే వారి సంఖ్య ఇంకా పెరిగింది.
10:30గంటలు:
ఈ సమయంలో ఈయూ నుంచి వైదొలగాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఇద్దరి మధ్య 10లక్షల పైగా భారీ వ్యత్యాసం వచ్చింది.
11:30గంటలు:
ఫలితాల ఉత్యంఠకు తెరపడింది. ఈయూ నుంచి వైదొలగడానికి అధిక శాతం ప్రజలు మొగ్గు చూపారు. మొత్తంగా చూస్తే ఈయూలోనే బ్రిటన్ ఉండాలని 1,61,41,241 మంది ఓటేయాగా, వైదొలగాలని 1,74,10,742 మంది కోరుకున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications