మాస్కులు లేకుండా రెండో సారి పట్టుబడితే 10 వేల రూపాయల జరిమానా .. ఎక్కడో తెలుసా !!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు పెరుగుదలతో కరోనా కట్టడి కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. ఉత్తరప్రదేశ్లో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టిన యూపీ సర్కార్ మాస్కులు లేకుండా పట్టుబడిన వారికి 10 వేల వరకు జరిమానా విధించాలని కఠిన నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తో పోరాడడానికి కఠిన నిబంధనలు విధించారు. కరోనా కట్టడి కోసం సాగిస్తున్న పోరాటంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారాంతంలో షట్ డౌన్ ప్రకటించింది . ఇక మాస్కులు లేకుండా బయట తిరిగిన వ్యక్తులకు మొదటిసారి పట్టుబడితే వెయ్యి రూపాయలు, రెండోసారి మాస్కులు లేకుండా పట్టుబడితే పది వేల రూపాయల జరిమానా విధించాలని కఠిన నిర్ణయం తీసుకుంది.

If caught a second time without masks, a fine of 10 thousand rupees in Uttar pradesh

వారాంతంలో అత్యవసర సేవలను మాత్రమే అనుమతినిస్తున్న యూపీ సర్కార్ వారాంతంలో అందరూ కంప్లీట్ లాక్‌డౌన్‌ పాటించాలని ఆదేశించింది. గత ఏడాది మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి పాఠశాలలు మే 15 వరకు మూసివేస్తామని, కరోనావైరస్ కేసుల్లో అత్యధిక సింగిల్ డే స్పైక్‌ను నివేదించిన తరువాత రాష్ట్ర బోర్డు పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు నిన్న ఉత్తరప్రదేశ్ సర్కార్ ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 22,439 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం 104 మరణాలు సంభవించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+