మాస్కులు లేకుండా రెండో సారి పట్టుబడితే 10 వేల రూపాయల జరిమానా .. ఎక్కడో తెలుసా !!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు పెరుగుదలతో కరోనా కట్టడి కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. ఉత్తరప్రదేశ్లో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టిన యూపీ సర్కార్ మాస్కులు లేకుండా పట్టుబడిన వారికి 10 వేల వరకు జరిమానా విధించాలని కఠిన నిర్ణయం తీసుకుంది.
భారత్ లో కరోనా కల్లోలం: రోజువారీ కేసుల రికార్డ్ బ్రేక్ 2,17,353 కొత్త కేసులు, 1,185 మరణాలు
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తో పోరాడడానికి కఠిన నిబంధనలు విధించారు. కరోనా కట్టడి కోసం సాగిస్తున్న పోరాటంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారాంతంలో షట్ డౌన్ ప్రకటించింది . ఇక మాస్కులు లేకుండా బయట తిరిగిన వ్యక్తులకు మొదటిసారి పట్టుబడితే వెయ్యి రూపాయలు, రెండోసారి మాస్కులు లేకుండా పట్టుబడితే పది వేల రూపాయల జరిమానా విధించాలని కఠిన నిర్ణయం తీసుకుంది.
వారాంతంలో
అత్యవసర
సేవలను
మాత్రమే
అనుమతినిస్తున్న
యూపీ
సర్కార్
వారాంతంలో
అందరూ
కంప్లీట్
లాక్డౌన్
పాటించాలని
ఆదేశించింది.
గత
ఏడాది
మహమ్మారి
వ్యాప్తి
చెందినప్పటి
నుండి
పాఠశాలలు
మే
15
వరకు
మూసివేస్తామని,
కరోనావైరస్
కేసుల్లో
అత్యధిక
సింగిల్
డే
స్పైక్ను
నివేదించిన
తరువాత
రాష్ట్ర
బోర్డు
పరీక్షలను
కూడా
వాయిదా
వేస్తున్నట్లు
నిన్న
ఉత్తరప్రదేశ్
సర్కార్
ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్
రాష్ట్రంలో
గత
24
గంటల్లో
22,439
కరోనా
కొత్త
కేసులు
నమోదయ్యాయి.
గురువారం
104
మరణాలు
సంభవించాయి.