భారత్ కు కీలక విజయం-గోగ్రా హైట్స్ నుంచి వైదొలిగేందుకు చైనా ఆంగీకారం
భారత్-చైనా మధ్య ఏడాదికి పైగా సాగుతున్న ప్రతిష్టంభన క్రమంగా వీడుతోంది. తూర్పు లడఖ్ లోని భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమైన కొన్ని కీలక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ కోసం జరుగుతున్న చర్చలు ఫలితమిస్తున్నాయి. తాజాగా మిలటరీ అధికారుల మధ్య సాగిన 12వ విడత చర్చల తర్వాత ఇరుదేశాల బలగాలు కీలకమైన గోగ్రా హైట్స్ నుంచి వైదొలగేందుకు అంగీకరించాయి.
Recommended Video
గతేడాది చైనా బలగాలు తిష్టవేసిన ప్రాంతాల్లో ఒకటైన గోగ్రా హైట్స్ లో అప్పటి నుంచీ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక్కడ చైనా బలగాలను వెనక్కి తీసుకోవడంపై జరిగిన చర్చల్లో భారత్ కు కీలక పురోగతి లభించినట్లయింది. గోగ్రా హైట్స్ తో పాటు మరికొన్ని సరిహద్దు పాయింట్ల నుంచి బలగాల ఉపసంహరణ కోసం ఇరు దేశాలు కొన్నిరోజులుగా చర్చలు జరుపుతున్నాయి. వీటిలో లభించే పురోగతి ఆధారంగానే తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉండటంతో ఇరుదేశాలకు పట్టు విడుపులకు పోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా మాల్డో ప్రాంతంలో ఇరుదేశాల సైనికాధికారుల మధ్య దాదాపు 9 గంటల పాటు సాగిన చర్చల్లో ఈ మేరకు గోగ్రా హైట్స్ నుంచి వైదొలగేందుకు చైనా అంగీకరించినట్లు భారత్ వెల్లడించింది. ఆరు నెలల క్రితం ప్యాంగాంగ్ సరస్సు వద్ద నుంచి బలగాల ఉపసంహరణకు చైనా అంగీకరించింది. ఆ తర్వాత బలగాల ఉపసంహరణ ఇదే తొలిసారి కావడం విశేషం. ఇదే ఊపులో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల్లోనూ బలగాల ఉపసంహరణ దిశగా ఇరు దే్శాలూ అడుగులు వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే తర్వాతి దశలో సాగే ఆర్మీ జనరల్ స్ధాయి చర్చల్లో ఈ దిశగా అడుగులు పడొచ్చని సమాచారం.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications