పాకిస్తాన్ అనాగరిక దాడి- తీవ్రంగా స్పందించిన భారత్..!
ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లోని ఆస్పత్రిపై పాకిస్తాన్ నిన్న రాత్రి జరిపిన వైమానిక దాడిలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మంది గాయాలపాలయ్యారు. ఈ దాడిపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ పౌరులు, రోగులు ఉండే ఆస్పత్రిపై దాడి చేయడం ఏంటని పాకిస్తాన్ పై పలు దేశాలు మండిపడుతున్నాయి. ఇదే క్రమంలో భారత్ (india) కూడా ఈ దాడిపై తీవ్రంగా స్పందించింది. కాబూల్ ఆస్పత్రిపై పాకిస్తాన్ దాడి అనాగరిక, పిరికి పంద చర్య అని విదేశాంగశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది.
ఇది ఒక పిరికిపంద, అమానుషమైన హింసాత్మక చర్య. సైనిక లక్ష్యంగా ఏ మాత్రం సమర్థించలేని ఒక ప్రదేశంలో ఈ దాడిలో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. పాకిస్తాన్ ఇప్పుడు ఈ మారణకాండను ఒక సైనిక చర్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఆసుపత్రిపై జరిగిన దాడి పాకిస్తాన్ చేసిన హేయమైన దురాక్రమణ చర్య అని, ఇది ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారంపై బహిరంగ దాడి, ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ప్రత్యక్ష ముప్పు అని విదేశాంగ శాఖ తెలిపింది.

ఈ దాడి పాకిస్తాన్ నిరంతర నిర్లక్ష్యపూరిత ప్రవర్తనా తీరును, తన సరిహద్దులకు బయట మరింత తీవ్రమైన హింసాత్మక చర్యల ద్వారా అంతర్గత వైఫల్యాలను బయటపెట్టడానికి పదేపదే చేస్తున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తోందని కేంద్రం పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు శాంతి, ఆత్మపరిశీలన, కరుణతో గడిపే పవిత్ర రంజాన్ మాసంలో ఈ దాడి జరగడం దీనిని మరింత ఖండించదగినదిగా చేస్తుందని తెలిపింది. ఒక ఆసుపత్రిని, దానిలోని రోగులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడాన్ని ఏ మతమూ, ఏ చట్టమూ, ఏ నైతికతా సమర్థించలేవని పేర్కొంది. ఈ నేరపూరిత చర్య'కు పాల్పడిన వారిని జవాబుదారీగా చేయాలని, ఆఫ్ఘనిస్తాన్లో పౌరులపై పాకిస్తాన్ చేస్తున్న విచక్షణారహిత దాడులను తక్షణం అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఆఫ్ఘనిస్తాన్లో మృతుల కుటుంబాలకు భారత్ తన 'ప్రగాఢ సంతాపం' తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
-
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
మొదటి రోజే పరువు పాయే! తెల్ల బంతి కాస్తా గులాబీగా మారింది! -
భారత్లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
"పాకిస్థాన్ లో నిద్రలేచిన నరరూప రాక్షసులు.. భారత్ కు పెను ముప్పు" -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!













Click it and Unblock the Notifications