హార్ముజ్ పై భారత్ కీలక నిర్ణయం..! నౌకలకు నేవీ ఆదేశాలు..!
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్దం మొదలుపెట్టాక కీలకంగా మారిపోయిన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)విషయంలో భారత్ కు మాత్రం మినహాయింపులు దక్కాయి. ఇరాన్ తమ మిత్రదేశమైన భారత్ కు రష్యా, చైనా, టర్కీ, పాకిస్తాన్ తో పాటు హార్ముజ్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది. కానీ ఇప్పుడు ఇరాన్ లో పరిస్ధితులు మారిపోయాయి. అక్కడ ప్రభుత్వం కంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రభావం ఎక్కువ కావడంతో హార్ముజ్ లో భారత నౌకలపై సైతం దాడులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ 18న ఐఆర్జిసి రెండు భారతీయ నౌకలపై కాల్పులు జరిపిన ఘటన తర్వాత, భారత నౌకాదళం (Indian navy) హాeర్ముజ్ జలసంధి సమీపంలో భద్రతా వలయాన్ని కట్టుదిట్టం చేసింది. పర్షియన్ గల్ఫ్లోని భారత జెండా నౌకలకు మన నౌకాదళం తాజా సూచన చేసింది. భద్రత కోసం లారాక్ ద్వీపానికి దూరంగా ఉండాలని, తాము ఆదేశించినప్పుడు మాత్రమే నౌకలు అటుగా ప్రయాణించాలని నేవీ సూచించింది. హార్ముజ్ జలసంధిని దాటడానికి ఎదురుచూస్తున్న అన్ని భారతీయ నౌకల భద్రతకు నేవీ ప్రాధాన్యత ఇస్తోంది.

ఇప్పటివరకు 111 భారతీయ నౌకలు ఈ జలసంధిని దాటాయి. చివరి ట్యాంకర్ 'దేశ్ గరిమ' ఏప్రిల్ 18న దాటింది. అదే రోజు 'జగ్ అర్నవ్', 'సన్మార్ హెరాల్డ్' అనే రెండు భారతీయ నౌకలు దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఇరాన్ గార్డుల కాల్పుల కారణంగా వెనుదిరగాల్సి వచ్చింది.ఈ జలసంధిని దాటిన తరువాత, దేశ్ గరిమ ప్రస్తుతం అరేబియా సముద్రంలో భారత నౌకాదళం రక్షణలో ఉంది మరియు ఏప్రిల్ 22న ముంబైకి చేరుకుంటుందని భావిస్తున్నారు. లారక్ ద్వీపం హోర్ముజ్ జలసంధి యొక్క అత్యంత ఇరుకైన ప్రదేశంలో ఉంది. ఇరాన్ ప్రధాన చమురు మౌలిక సదుపాయాలకు నిలయంగా ఉంది. ఇది ఇరాన్ ఇంధన రంగానికి కీలకమైనది కాబట్టి, చుట్టుపక్కల జలాల్లో భారీ భద్రత ఉంటుంది. బంకర్లు, రాడార్ వ్యవస్థల నెట్వర్క్ ద్వారా హార్ముజ్ లో జరిగే రాకపోకలను నిశితంగా పర్యవేక్షిస్తారు.












Click it and Unblock the Notifications