కూలిన విమానంలో మిలియన్ డాలర్ల డబ్బు
జకార్తా: ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్లోని పర్వత ప్రాంతాల్లో ఆదివారం కుప్పకూలిన విమానంలో సుమారు 4లక్షల డెభ్భై వేల డాలర్ల డబ్బు ఉన్నట్లు సోమవారం పోస్ట్ ఆఫీస్ అధికార ప్రతినిధి అబు సోఫ్జాన్ వెల్లడించారు.
సిబ్బంది సహా 54 మంది ప్రయాణికులతో కూలిపోయిన త్రిగణ ఏటీఆర్ 42-300 విమానం శకలాల వద్దకు చేరుకోవడానికి సహాయ సిబ్బంది ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. విమానంలో నలుగురు ప్రయాణికులు 6.5 బిలియన్ల ఇండోనేషియా రూపాయలు(4.70 లక్షల అమెరికా డాలర్లు) తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పేదలకు డబ్బు పంపిణీ చేయడానికి తీసుకెళ్తున్నారని అబు సోఫ్జాన్ తెలిపారు. బింటాంగ్ పర్వత ప్రాంతంలోని అడవుల్లో సహాయక విమానం శిథిలాలు గుర్తించిందని.. అవి త్రిగణ విమాన శకలాలేనా అనే అంశం గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
గాలింపు బృందాలు ఆ ప్రాంతానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విమానంలో ప్రయాణికులంతా ఇండోనేషియాకు చెందిన వారేనని చెప్పారు. ప్రయాణీకుల్లో 44 మంది పెద్దలు, ఐదుగురు పిల్లలు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications