ఇజ్రాయెల్ ఆయుధ రక్షణ వ్యవస్థలు ఖాళీ ? మరో 12 రోజులు దాటితే?
అమెరికాతో అణుచర్చలు విఫలం కాగానే ఇరాన్ పై దాడికి దిగి యుద్ధానికి కారణమైన ఇజ్రాయెల్ కు వరుస షాకులు తప్పడం లేదు. ముఖ్యంగా ఇరాన్ లోని అణు స్ధావరాల్ని కూల్చేశామంటూ తొలుత ప్రకటించిన ఇజ్రాయెల్ కు ఆ తర్వాత వాటికి పెద్దగా నష్టం జరగలేదంటూ వచ్చిన వార్తలు కంటిమీద కునుకులేకుండా చేశాయి. అయితే అణు శాస్త్రవేత్తల్ని మాత్రం విజయవంతంగా హతమార్చింది. దీంతో ఇరాన్ వరుసగా చేస్తున్న దాడుల్ని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ విఫలమవుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో ఇంతకాలం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ వచ్చిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సామర్ధ్యం మీదే అంతర్జాతీయంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో తాజాగా తమ నిఘా విభాగం మొస్సాద్ కేంద్ర కార్యాలయంపైనే ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో ఇజ్రాయెల్ దిక్కుతోచని స్దితిలోకి వెళ్లిపోయింది. పైకి టెహ్రాన్ ప్రజలు పారిపోవాలని, భారీ దాడులు తప్పవని హెచ్చరికలు చేస్తున్న ఇజ్రాయెల్ కు ఇప్పుడు తమ ఆయుధ వ్యవస్ధలు ఖాళీ అయిపోతుండటం ఆందోళనకరంగా మారుతోంది.

ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా కథనంలో పేర్కొంది. ఇప్పటికే ఇరాన్ దాడులకు అతలాకుతలం అవుతున్న ఇజ్రాయెల్ కు ఇప్పుడు తమ గగనతల ఆయుధ రక్షణ వ్యవస్ధల్లో ఆయుధాలు ఖాళీ అవుతుండటం ఆందోళనకరంగా మారిందని తెలిపింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ వద్ద ఉన్న స్టాక్ చూసుకుంటే మరో 12 రోజుల పాటు మాత్రమే గగనతల రక్షణ వ్యవస్ధలు పనిచేసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో 12 రోజుల తర్వాత ఇరాన్ దాడులు కొనసాగిస్తే వాటిని తట్టుకోవడం ఇజ్రాయెల్ కు కష్టంగా మారబోతోందని తెలుస్తోంది.

ఇరాన్ లో మౌలిక సదుపాయాల్ని పెద్ద ఎత్తున టార్గెట్ చేసి విజయం సాధించినట్లు చెప్పుకుంటున్నా.. ప్రస్తుతం ఇజ్రాయెల్ తన దీర్ఘ-శ్రేణి క్షిపణి నిరోధకాల సరఫరాను వేగంగా తగ్గిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఇజ్రాయెల్ తో సన్నిహిత సంబంధాలున్న ఓ యూఎస్ అధికారి తమకు ఈ విషయం చెప్పారని పేర్కొంది. ఇరాన్ క్షిపణి లాంచర్లు మూడింట ఒక వంతు ధ్వంసం అయ్యాయని, ఇరాన్ ఆకాశంపై వాయు ఆధిపత్యాన్ని సాధించాయని ఇజ్రాయెల్ తాజాగా తెలిపింది. అయినా ఇరాన్ క్షిపణి జాబితాలో సగానికి పైగా చెక్కుచెదరకుండా ఉన్నాయని, ఇందులో ఓ భాగం భూగర్భంలో దాచి ఉంచారని తెలిపింది.
మరోవైపు ఇజ్రాయెల్ ఓ రాత్రి యుద్ధం చేసేందుకు 285 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.












Click it and Unblock the Notifications