అరబ్బులపై మూకదాడులు టీవీల్లో లైవ్ -ఇజ్రాయెల్ మీడియా వికృతం -గాజా దాడుల్లో మృతుల సంఖ్య పైపైకి
మిడిల్ ఈస్ట్లో మరణహోమం జోరుగా సాగుతోంది. సరిహద్దుకు అవతలున్న శతృ శిబిరాలపై సైన్యాలు బాంబులు, మిస్సైళ్లతో దాడులు చేస్తోంటే.. సరిహద్దులోపల చేతికి చిక్కిన శతృవును జనం వట్టి చేతులతోనే కిరాతకంగా హతమారుస్తున్నారు. ఈ భయానక మారణకాండ దృశ్యాలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ టీఆర్పీలను పెంచుకుంటున్నాయి ఇజ్రాయెలీ మీడియా సంస్థలు. వివరాల్లోకి వెళితే..
యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాలకు మూల కేంద్రమైన జెరుసలేం నగరంలో అల్ అఖ్సా మసీదు ప్రాంగణంలో కొద్ది రోజుల కిందట పాలస్తీనా, ఇజ్రాయెల్ దళాలకు మధ్య తలెత్తిన ఘర్షణ ఇప్పుడు యుద్ధంగా మారింది. రెండు దేశాలు పరస్పరం బాంబులు, రాకెట్లతో దాడులుచేసుకుంటుండగా, దేశం లోపలున్న అరబ్బులు, పాలస్తీనియన్లను స్థానికి ఇజ్రాయెలీ పౌరులు వెంటాడి చంపుతున్నారు. ఈ క్రమంలో జరిగిన అత్యంత పాశవికమైన దాడిని ఇజ్రాయెలీ టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ఇజ్రాయెల్ పాత రాజధాని టెల్ అవీవ్ సిటీ దక్షిణ ప్రాంతమైన బాట్ యామ్ పరిసరాల్లో.. కొందరు రైట్ వింగ్ ఇజ్రాయెలీ మూక సామూహికంగా ఓ అరబ్ వ్యక్తిపై దాడి చేయడం బుధవారం రాత్రి టీవీలో ప్రత్యక్ష ప్రసారమైంది. కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని బలవంతంగా బయటకు లాగి, స్పృహ కోల్పోయే వరకు దారుణంగా కొట్టినట్లు ఈ దృశ్యాల్లో కనిపించింది. ఈ దృశ్యాలను ప్రభుత్వ బ్రాడ్కాస్టర్ 'కాన్' ప్రసారం చేసింది. బాధితుడు రోడ్డుపై నిస్సహాయ స్థితిలో పడిపోగా, ఘటన జరిగిన దాదాపు 15 నిమిషాల తర్వాతగానీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాగా,
అరబ్బు వ్యక్తి కారుతో హత్యాయత్నానికి పాల్పడటం వల్లే తాము దాడి చేయాల్సి వచ్చిందని ఇజ్రాయేలి మూకలు చెప్పుకొచ్చాయి. ఇషిలోవ్ హాస్పిటల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో, ''మూక దాడి బాధితుడు తీవ్రంగా గాయపడినప్పటికీ, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది'' అని తెలిపింది. అయితే ఆయన వివరాలు మాత్రం తెలియరాలేదు. మరోవైపు..

పాలస్తీనాలో అంతర్భాగం, ఇజ్రాయెల్ తనదిగా చెప్పుకునే గాజా ప్రాంతంపై సోమవారం నుంచి ఎడతెరపి లేకుండా రాకెట్ బాంబుల దాడి జరుగుతూనే ఉంది. రెండు దేశాలూ పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. గురువారం నాటికి గాజా దాడుల మృతుల సంఖ్య 83కు పెరిగింది. ఇందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటిదాకా సుమారు 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఇజ్రాయెల్ నగరాల్లో జరుగుతోన్న ఘటనలు ఆమోదయోగ్యం కాదని ప్రధాని నెతన్యాహు కంటితుడుపు ప్రకటన చేశారు.
-
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. కీలక విషయాలపై చర్చ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
ఇరాన్ కు జి7 దేశాల తీవ్ర హెచ్చరిక! -
నతాంజ్ అణు కేంద్రంపై బాంబుల వర్షం.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం











Click it and Unblock the Notifications