భారీ అగ్ని ప్రమాదం.. 20 మందికి పైగా మృతి
ఓ ఆఫీస్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగింది. మంగళవారం(డిసెంబర్ 09) మధ్యాహ్నం ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందినట్లు పోలీసులు, స్థానిక మీడియా వెల్లడించింది. భవనం మొదటి అంతస్తులో ఉన్న ఒక బ్యాటరీ పేలడంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఇండోనేషియా రాజధాని జకార్తా లోని ఓ ఏడు అంతస్తుల కార్యాలయ భవనంలో మంగళవారం (డిసెంబర్ 9) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 15 మందికి పైగా మహిళలు ఉన్నారు. మరికొంత మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. భవనం మొదటి అంతస్తులో ఉన్న ఓ బ్యాటరీ పేలడంతోనే మంటలు చెలరేగినట్లు పోలీసులు, స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న ఓ బ్యాటరీ పేలిన నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు పై అంతస్తులకూ వ్యాపించాయి. మంటల ధాటికి భవనంలో చిక్కుకున్నవాళ్లు బయటకు రాలేకపోయారు. సెంట్రల్ జకార్తా పోలీసు చీఫ్.. ఈ ఘటనపై స్పందిస్తూ ప్రస్తుతానికి 20 మంది మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. వీరిలో ఐదుగురు పురుషులు, 15 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. మృతుల్లో ఓ గర్భిణి కూడా ఉన్నట్లు తెలిపారు. దట్టమైన పొగను పీల్చడం కారణంగా ఊపిరాడక మృతి చెందినట్లు అంచనాకు వచ్చారు. దర్యాప్తులో భాగంగా మృతదేహాలను శవపరీక్షల కోసం పోలీసు ఆసుపత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు.

ఇక ఈ కార్యాలయం 'టెర్రా డ్రోన్ ఇండోనేషియా' అనే సంస్థకు చెందింది. ఈ సంస్థ మైనింగ్, వ్యవసాయ రంగాలలో వైమానిక సర్వే కార్యకలాపాల కోసం డ్రోన్ లను తయారు చేస్తుంది. ఇదిలాఉండగా.. 2023 లో తూర్పు ఇండోనేషియాలోని నికెల్-ప్రాసెసింగ్ ప్లాంట్ లో సంభవించిన పేలుడు కారణంగా జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మంది గాయపడిన విషయం తెలిసిందే.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications