వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీలంకలో కీలక పరిణామం: నూతన ప్రధానిగా మహింద రాజపక్సే
కొలంబో: శ్రీలంక దేశ రాజకీయాల్లో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్సే ప్రమాణస్వీకారం చేశారు. అధికార యూపీఎఫ్ఏ సంకీర్ణ కూటమి నుంచి మైత్రిపాల సిరిసేన పార్టీ వైదొలగడంతో ఈ కీలక మలుపు చోటుచేసుకుంది.
కూటమి నుంచి బయటకు వచ్చిన వెంటనే ప్రధానిగా కొనసాగుతున్న రణిల్ విక్రమ సింఘేను పదవీచ్యుతుడిని చేసి.. తదుపరి ప్రధానిగా రాజపక్సేతో ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రమాణస్వీకారం చేయించారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రభుత్వం విడుదల చేసింది. శ్రీలంకలో యునైటెడ్ ప్రభుత్వం 2015లో ఏర్పాటైంది. రణిల్ విక్రమసింఘే మద్దతుతో సిరిసేన దేశాధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.
Comments
sri lanka mahinda rajapaksa maithripala sirisena prime minister శ్రీలంక మైత్రిపాల సిరిసేన ప్రధానమంత్రి
English summary
Former President Mahinda Rajapaksa has been sworn-in as the Prime Minister before President Maithripala Sirisena. He replaced Ranil Wickremesinghe, reports Sri Lankan media.
Story first published: Friday, October 26, 2018, 23:04 [IST]