పిలిప్పైన్స్లో భారీ భూకంపం: 73 మంది మృతి
మనీలా: పిలిప్పైన్స్ను మంగళవారం భారీ భూకంపం వణికించింది. మధ్య పిలిప్పైన్స్లో ఈ భూకంపం రెక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. ఇందులో 73 మంది మరణించారు. భూకంపం తాకిడికి భవనాలు కూలిపోయాయి. చర్చిలు నేలకూలాయి. భయాందోళనలతో ప్రజలు పరుగులు తీయడంతో తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి.
భూకంపం తాకిడికి బోహోల్ దీవిలో 57 మంది మృత్యువాత పడ్డారు. దాని పరిసరాల్లో గల సిబూ, సిక్వాజోర్ దీవుల్లో 16 మంది మరణించినట్లు జాతీయ విపత్తుల సంస్థ ప్రకటించింది. భవనాలు, చర్చిలు కూలి పడడంతో రోడ్లు మూసుకుపోయాయి.

మంగళవారం ఉదయం 8 గంటల 12 నిమిషాలకు భూకంపం పిలిప్పైన్స్ ప్రజలను భీతావహులను చేసింది. సిబూలో పెద్ద యెత్తున విధ్వంసం జరిగింది. బోహోల్ దీవిలో చాలా భవనాలు కూలిపోయాయి. రోడ్లు బీటలు వారాయి. వంతెనలు కూలిపోయాయి.
భవనం నుంచి తాము బయటకు పరుగులు తీశామని, అయితే తమకు అడ్డంగా చెట్లు కూలిపడ్డాయని బోహోల్లోని ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఉద్యోగి చెప్పారు. కార్యాలయాలను, విద్యాసంస్థలను మూసేశారు. జాతీయ సెలవు దినంగా ప్రకటించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications