బంగ్లాదేశ్లో వెలుగుచూసిన వెయ్యేళ్ల కిందటి హిందూ ఆలయం
ఢాకా: పురావస్తు శాఖ అధికారులు బంగ్లాదేశ్లో వెయ్యేళ్ల కిందటి హిందూ దేవాలయాన్ని గుర్తించారు. బంగ్లాదేశ్లోని వాయువ్య ప్రాంతంలో దీనిని గుర్తించారు. దీనిని పాలరాజవంశం కాలంలో నిర్మించారని చెబుతున్నారు.
దీనిని పాలరాజ వంశస్తులు నిర్మించారని చెబుతున్నారు. దినాజ్పూర్లోని బొచ్చగంజ్ ప్రాంతంలో ఈ దేవాలయాన్ని కనుగొన్నామని జహంగీర్ నగర్ వర్సిటీ ప్రొఫెసర్, పురావస్తు శాస్త్రవేత్త స్వాధీన్ సేన్ చెప్పారు.
ఈ దేవాలయం గురించి మరిన్ని వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు.
ఈ ఆలయాన్ని ఎనిమిది తొమ్మిదో సెంచరీ మధ్యలో నిర్మించి ఉంటారని ఆయన చెప్పారు. బొచ్చగంజ్ సబ్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం మెహెర్పూర్ గ్రామంగా పిలుస్తున్నారు.
స్థానిక రైతులకు కొందరికి కొన్ని పురాతన వస్తువులు దొరికాయి. ఆ ప్రాంతం ప్రభుత్వం ఆధీనంలో ఉంది. రైతులకు పండించుకునేందుకు దానిని లీజుకు ఇచ్చింది. అయితే, తమకు పురాతన వస్తువులు దొరకడంతో రైతులు దానిని పురావస్తు శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు.

తాము అక్కడ కొన్ని విగ్రహాలు, మెట్లు గుర్తించామని, మిగతా వివరాల కోసం తవ్వకాలు జరుపుతున్నామని మరో తవ్వకాలను పర్యవేక్షిస్తున్న సోహగ్ అలీ చెప్పారు. ఇటీవలే బుద్దిస్ట్ ఆలయాన్ని గుర్తించారు. బుద్దిస్ట్ ఆలయాన్ని గుర్తించిన రెండు మూడు నెలలకు ఇప్పుడు మరో హిందూ దేవాలయం వెలుగుచూసింది.
బంగ్లాదేశ్లో ఢాకేశ్వరి ఆలయం నేషనల్ టెంపుల్. ఇది అత్యంత ప్రాచీనమైన ఆలయం. దీనిని పన్నెండవ సెంచరీలో నిర్మించారు. బల్లాల సేన దీనిని నిర్మించారు. ఇతను సేన రాజవంశీయులు. పాలరాజవంశస్థుల తర్వాత సేనరాజులు పాలించారు. రాజధానిలో ఢాకేశ్వరి ఆలయం ఉండటం వల్లనే దానికి ఢాకా అని పేరు వచ్చినట్లు చెబుతారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications