నేపాల్లో తాజాగా రెండు సార్లు భూప్రకంపనలు
ఖాట్మండు: నేపాల్లో మళ్లీ భూమి కంపించింది. శుక్రవారం ఉదయం నేపాల్ మధ్య ప్రాంతంలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ మీద వీటి తీవ్రత వరుసగా 4,5గా నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు.
నేపాల్ మధ్య ప్రాంతంలోని సింధు పాల్ చౌక్, డోలకా జిల్లాల్లో శుక్రవారం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాంతాలలో భూకంప కేంద్రాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ముందు జాగ్రత చర్యగా ఆ ప్రాంతంలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

గత నెల 25వ తేదీన వచ్చిన భారీ భూకంపం తర్వాత నేపాల్ లో అప్పుడప్పుడు రిక్టర్ స్కేల్ తీవ్రత 4 లేదా అంతకంటే ఎక్కవగా ఇప్పటి వరకు 150 సార్లు భూప్రకంపనలు వచ్చాయని అధికారులు అంటున్నారు.
నేపాల్ లో భూ కంపం వలన మరణించిన వారి సంఖ్య 8 వేలకు పైగా పెరిగింది. సహాయక చర్యలు ఇంకా జరుగతున్నాయి.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications