పసిపాపను 12సార్లు పొడిచి, పాతిపెట్టినా బతికింది
బ్యాంకాక్: పన్నెండుసార్లు కత్తితో పొడిచి, సజీవంగా పాతి పెట్టినప్పటికీ పసిపాప బతికిబట్ట కట్టిన సంఘటన థాయ్లాండులో చోటు చేసుకుంది. సాధారణంగా కత్తితో పొడిస్తే గాయాలు తీవ్రంగానే అవుతాయి. అదీ పలుమార్లు కత్తితో పొడిస్తే వారు చనిపోతారు.
కానీ థాయ్లాండులో మాత్రం అప్పుడే పుట్టిన శిశువు మాత్రం బతికి బయటపడింది. ఆ పసిగుడ్డును బతికుండగానే పాతిపెట్టి పోయినా ప్రాణాలతో తిరిగి ప్రపంచాన్ని చూసింది.
థాయ్లాండులోని ఖాన్ కేన్ అనే ప్రావిన్సులో పశువులను కాసేందుకు వెళ్లిన మహిళకు అక్కడి పొలాల్లో పసిపాప ఏడుపు వినిపించింది. ఆమె ఏడుపు వినిపించిన ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఓ పాప ఒళ్లంతా కత్తితో పొడిటిన గాయాలు ఉన్నాయి. అంతేకాగు, ఓ గుంటలో ఉంది ఆమె పైన ఆకులు తదితరాలు కప్పి ఉన్నాయి.
ఆ పాపను కాపాడిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం ఆసుపత్రికి తరలించి పాప ప్రాణాలు కాపాడారు. ఆ పాప ఆరోగ్యం బాగుంది. పోలీసులు పాప తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.