కూలిపోయే ప్రభుత్వాల దేశంలో.. మైండ్ బ్లోయింగ్ రికార్డ్ కొట్టిన మెలోని!

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ రాజకీయాల్లో ఎవరూ సాధించని అరుదైన ఘనతను ఆ దేశ తొలి మహిళా ప్రధాని జార్జియా మెలోని సొంతం చేసుకున్నారు. వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగుతున్న నాయకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని మెలోనికి ఎక్స్ వేదికగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇటలీ ప్రజలు ఆమె నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి ఈ అరుదైన విజయం నిదర్శనమని మోదీ కొనియాడారు. ఇరు దేశాల మధ్య దౌత్య బంధాన్ని బలోపేతం చేయడంలో మెలోని కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

స్థిరత్వానికి చిహ్నం.. 'స్ట్రాంగర్ ఇటలీ'!

అతిపెద్ద రాజకీయ అస్థిరతకు మారుపేరైన ఇటలీలో ఒక ప్రభుత్వం ఇన్ని రోజులు స్థిరంగా కొనసాగడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న 'బ్రదర్స్ ఆఫ్ ఇటలీ' పార్టీ దక్షిణ ఇటలీలోని బారీ నగరంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. "అత్యంత స్థిరమైన ప్రభుత్వం.. మరింత బలమైన ఇటలీ" అనే నినాదంతో వేలాది మంది మద్దతుదారుల మధ్య మెలోని ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నిరంతరం ప్రభుత్వాలు కూలిపోయే ఇటలీ రాజకీయ చరిత్రలో తన మార్క్ పాలనతో మెలోని రికార్డు సృష్టించారు.

PM Narendra Modi Congratulates Giorgia Meloni on Becoming Italy Longest Serving Postwar Prime Minister
161 ఏళ్ల ఇటలీ చరిత్రలో తొలి మహిళా ప్రధాని.. జార్జియా మెలోని జీవిత గాథ
161 ఏళ్ల ఇటలీ చరిత్రలో తొలి మహిళా ప్రధాని.. జార్జియా మెలోని జీవిత గాథ

సవాళ్లను దాటుకుని.. ప్రపంచ వేదికపై మెరుపులు!

2022 అక్టోబరులో ఇటలీకి మొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మెలోనిపై అంతర్జాతీయంగా అనేక అనుమానాలు ఉండేవి. తీవ్ర కుడిపక్ష భావజాలం ఉన్న పార్టీ నుంచి వచ్చిన ఆమె పాలన ఎలా ఉంటుందోనని ఐరోపా దేశాలు, ఆర్థిక మార్కెట్లు ఆందోళన చెందాయి. కానీ, తన చాకచక్యమైన వ్యూహాలు, ఆచరణాత్మక నిర్ణయాలతో ఆమె అందరి అంచనాలను తిరగరాశారు. ఉక్రెయిన్ సంక్షోభంలో దృఢమైన వైఖరిని అవలంబించడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ఇటలీ ఇమేజ్‌ను పెంచారు. అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్‌తో సహా అనేక మంది ప్రపంచ నేతలతో ఆమె మంచి మైత్రిని కొనసాగిస్తున్నారు.

రూపాయి చాక్లెట్ తెచ్చిన అదృష్టం.. 'మెలోడీ’ గిఫ్ట్.. దలాల్ స్ట్రీట్‌ను షేక్
రూపాయి చాక్లెట్ తెచ్చిన అదృష్టం.. 'మెలోడీ’ గిఫ్ట్.. దలాల్ స్ట్రీట్‌ను షేక్

భారత్ - ఇటలీ బంధానికి కొత్త ఊపిరి!

ప్రధాని నరేంద్ర మోదీ, జార్జియా మెలోనిల మధ్య ఉన్న సత్సంబంధాలు ఇరు దేశాల దౌత్య నీతికి కొత్త బలాన్నిచ్చాయి. 'భారత్ - ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' బలోపేతం చేయడంలో మెలోని చొరవ అభినందనీయమని మోదీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రెండు దేశాల ప్రజల సంక్షేమం, ఆర్థిక పురోగతి కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆకాంక్షించారు. 2027లో జరగబోయే తదుపరి ఎన్నికల వైపు అడుగులు వేస్తున్న మెలోని, ఆధునిక ఇటలీ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతగా నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+