ఆత్మాహుతి దాడి: మంత్రితోపాటు 8మంది మృతి
పాకిస్థాన్: పాకిస్థాన్లోని పంజాబ్లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో పంజాబ్ రాష్ట్ర హోం మంత్రితో సహా 8 మంది మృతి చెందారు. ఆదివారం పంజాబ్లోని హోంమంత్రి నివాసంపై ఉగ్రవాదులు ఆత్మాహతి దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో పంజాబ్ రాష్ట్ర హోంమంత్రి షుజా ఖాన్జాదా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో ఆయనతో పాటు మరో 8మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
హైతీలో ఘోర రోడ్డు ప్రమాదం: 17 మంది మృతి

హైతీలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోగా 18 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగో జాతీయ రహదారిపై లిమోనేడ్ పట్టణం సమీపంలో ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications