టెక్కీలకు షాక్:ఉద్యోగుల తొలగింపు, రూ.200 కోట్లు ఆదా ఇలా....
ఖర్చులను తగ్గించుకోలేక ఆదాయం పెంచుకోలేక యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా 49 మంది టెక్కీలను ఉద్యోగాల నుండి తప్పించింది. ఈ పనిని భారతీయ కంపెనీ హెచ్ సి ఎల్ కు ఇచ్చింది.
శాన్ ఫ్రాన్సిస్కో:అమెరికాలో ఐటి ఉద్యోగులకు అనుకోని షాక్ తగిలింది. ఇంతకాలం పాటు తమ వద్ద పనిచేస్తోన్న 49 మంది ఐటి ఉద్యోగులను శాన్స్ ఫ్రాన్సిస్కో నగరంలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిపోర్నియా ఇంటికి పంపేసింది.ఈ పనిని ఇండియాలోని హెచ్ సిఎల్ టెక్నాలజీస్ సంస్థకు ఔట్ సోర్సింగ్ కు ఇచ్చింది.
యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని తన కార్యాలయాన్ని మూసివేసింది. ఇక్కడ చేసే పనిని ఇండియాలో హెచ్ సి ఎల్ కంపెనీని ఔట్ సోర్సింగ్ కింద అప్పగించింది. తద్వారా యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు ప్రతి ఏటా సుమారు రూ.200 కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉంది.
గత ఏడాది జూలై మాసం నుండి యూనివర్శిటీ ఆఫ్ కాలిపోర్నియా ఈ దిశగా ఆలోచిస్తోంది.ఇన్నాళ్ళ తర్వాత దాన్ని అమలు చేసింది. ఆరోగ్య రంగంతో పాటు రీసెర్చ్ ఆధారిత యూసిఎస్ ఎఫ్ కార్యక్రమాన్ని నిర్వహించే యూనివర్శిటీ ఆఫ్ కాలిపోర్నియా ఆదాయాన్ని పెంచుకోలేక ఖర్చులు తగ్గించుకోలే ఇబ్బంది పడుతోంది.

దీంతో ఇప్పుడు తమ ఐటీ పనిని ఔట్ సోర్సింగ్ కు ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది. వాస్తవానికి ఔట్ సోర్సింగ్ వ్యవహరంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడుతున్న తరుణంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా తమ పననిని ఔట్ సోర్సింగ్ కు ఇవ్వడం ఇదే మొదటిసారని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. టెక్నాలజీ ఖర్చులు పెరుగుతున్నందున ఉద్యోగాలు తీసేవేయక తప్పని పరిస్థితి నెలకొందన్నారాయన. ఈ 49 మందిని తీసివేయడమే కాకుండా, ఖాళీగా ఉన్న 48 పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో భర్తీ చేయడం లేదా అసలు ఆ ఉద్యోగాల ఖాళీలను తీసేయడం లాంటి చర్యలను చేపడుతామన్నారు. అయితే తమను ఉద్యోగాల నుండి తీసేసి ఔట్ సోర్సింగ్ ఇవ్వడం మంచిది కాదంటున్నారు ఉద్యోగులు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications