దుబాయ్ లో అంతే, ఉమ్మితే రూ. 17 వేలు ఫైన్
దుబాయ్: దుబాయ్ లో పర్యాటకులను ఆకట్టుకోవడానికి అక్కడి అందాలను, పరిసర ప్రాంతాలను పరిరక్షించుకోవాలని పాలకులు నిర్ణయించారు. పరిసర ప్రాంతాలను పాడు చేసి నిర్లక్షంగా వ్యవహరించే వారికి భారీగా జరిమానా విధించాలని నిర్ణయించారు.
దుబాయ్ లోని ఖలీజ్ టైమ్స్ అనే పత్రిక ఈ వివరాలను వెల్లడించింది. ఎమిరేట్స్ అందాలను పాడు చేస్తున్న వారిని గుర్తించడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక నిఘా వర్గాలను ఏర్పాటు చేసింది. ఆ నిఘా వర్గాలు గుట్టు చప్పుడు కాకుండా వివిధ ప్రాంతాలలో సంచరించనున్నారు.
దుబాయ్ లో ఎక్కడైనా రోడ్ల మీద, రోడ్ల పక్కన ఉమ్మి వేస్తే రూ. 17,000 వేలు (వెయ్యి దిర్హమ్స్) అపరాధ రుసుం విధించనున్నారు. అదే విధంగా రోడ్ల చుట్టు పక్కల ఉన్న గొడల మీద అనుమతి లేకుండా పోస్టర్లు అతికించినా రూ. 17,000 ఫైన్ కట్టవలసి ఉంటుంది.
సముద్రంలోకి చమురు లీకేజ్ చేసిన వారికి రూ. 51,000, దుబాయ్ మునిసిపాలిటి చెత్త వాహనాలలో పురుగుల మందు క్యాన్ లు విసిరి వేస్తే రూ. 85,000 అపరాద రుసుం విధించాలని అక్కడి పాలకులు నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకులను ఆకర్షించి దుబాయ్ ఆందాలను కాపాడటానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నామని పాలకులు అంటున్నారు.