నైజీరియాలో 54 మంది మృతి: బొలివియాలో 8 మంది
యోలా: నైజీరియాలో వేరువేరు దుర్ఘటనలలో 54 మంది మృతి చెందారు. తూర్పు నైజీరియాలోని సెయింట్ డోమ్నిక్ క్యాథలిక్ చర్చిలో శనివారం తొక్కిసలాట జరిగింది. ఇందులో ఇరవై నాలుగు మంది వరకు మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఓ పెళ్లి వేడుకపై ఇస్లామిక్ మిలిటెంట్లు కాల్పులు జరిపారు. దీంతో వరుడు సహా 30 మంది మృతి చెందారు. ఈ ఘటన నార్త్ వెస్ట్ నైజీరియా ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లుగా మిలిటరీ అధికార ప్రతినిధి కల్నల్ మహమ్మద్ డోల్ చెప్పారు. బోర్నో రాష్ట్రంలోని గామా - గోజా నగర మధ్యన తీవ్రవాదులు దాడి చేసి చంపినట్లు చెప్పారు.

బోకో హారమ్ తీవ్రవాదులు ఈ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఫిర్గి గ్రామం సమీపంలో పలు మృతదేహాలు పడి ఉన్నట్లు ఓ మినీ బస్ టాక్సీ డ్రైవర్ ఆదివారం తెలిపాడు.
బొలీవియాలో విమానం కూలి 8 మంది మృతి
బొలీవియాలో విమానం కూలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. రెబెరెల్లాలోని అమెజాన్ సిటీ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదం జరిగింది. తొమ్మిది మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో విమానంలో ముప్పై మంది వరకు ఉన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications