వృద్ధుడి మృతదేహంతో పోస్టాఫీసుకు వచ్చారు.. పెన్షన్ ఇవ్వమని అడిగారు.. ఆ తర్వాత..

ఒక వృద్ధుడి మృతదేహాన్ని పోస్టాఫీసుకి తీసుకెళ్లి అతడి పెన్షన్ తీసుకోవటానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించటం కలకలం రేపింది.
ఐర్లండ్లోని కార్లో పట్టణంలో శుక్రవారం జరిగిన ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చనిపోయిన పెన్షనర్ను ఇద్దరు వ్యక్తులు జాగ్రత్తగా పడిపోకుండా పట్టుకుని తెచ్చారని, పోస్టాఫీసులోకి వచ్చి అతడి పెన్షన్ ఇవ్వాలని కోరారని ఐరిష్ టైమ్స్ ఒక కథనంలో చెప్పింది.
'అలా పట్టుకుని తెచ్చారు, అతడి ఆరోగ్యం బాగానే ఉందా?’ అని సిబ్బంది ప్రశ్నలు సంధించటంతో గుర్తు తెలియని ఆ ఇద్దరు వ్యక్తులు.. వృద్ధుడి మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారని తెలిపింది.
- ఐర్లండ్ తీరంలో యూఎఫ్ఓలు: విమానాలపైకి 'చాలా ప్రకాశవంతమైన వెలుగు’
- చీర్లీడర్స్: 'మమ్మల్ని కేవలం అందమైన ఆట బొమ్మల్లా చూస్తారు’
ఆ కథనం ప్రకారం.. వృద్ధుడికి ఏమయ్యిందోనని పరిశీలించిన సిబ్బంది.. అతడు చనిపోయినట్లు గుర్తించి దిగ్భ్రాంతికి లోనయ్యారు.
''ఓ వృద్ధుడి మరణానికి దారితీసిన పరిస్థితులపై గార్డాయ్ (ఐర్లండ్ పోలీసు విభాగం) దర్యాప్తు చేస్తోంది’’ అని ఆ కథనంలో వివరించింది.
ఈ సంఘటన గురించి వ్యాఖ్యానించటానికి గార్డా అధికార ప్రతినిధి నిరాకరించారు. అయితే ఒక సంక్షిప్త ప్రకటన విడుదల చేశారు.
ఈ కేసు దర్యాప్తులో ''గార్డా టెక్నికల్ బ్యూరో, ఆఫీస్ ఆఫ్ ద స్టేట్ పాథాలజిస్ట్ సేవలను కోరాం. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత.. ఆ ఫలితాలను బట్టి దర్యాప్తు జరుగుతుంది’’ అని చెప్పారు.
- 'పెద్దలు కుదిర్చే పెళ్లి నుంచి నన్ను కాపాడండి’
- స్కాచ్ విస్కీ: బ్రిటన్ – ఇండియా వాణిజ్య చర్చల్లో ఈ అంశం ఎందుకంత కీలకం
శుక్రవారం ఈ ఘటన జరగటానికి ముందు.. అదే పోస్టాఫీసుకి ఒక వ్యక్తి ఫోన్ చేసి, ఒక వృద్ధుడి తరఫున పెన్షన్ తీసుకోవటానికి వస్తానని చెప్పినట్లు ఐర్లండ్ రేడియో ఆర్టీఈ తన వార్తల్లో తెలిపింది.
అయితే.. పెన్షన్ డబ్బులు విడుదల చేయాలంటే సదరు పెన్షనర్ తప్పనిసరిగా ఉండాలని చెప్తూ ఆ వినతిని సిబ్బంది తిరస్కరించారు.
ఆ తర్వాత కొంత సేపటికి.. ఇద్దరు వ్యక్తులు 60 ఏళ్ల వయసున్న ఓ పురుషుడిని తీసుకు వచ్చారు. అతడు పోస్టాఫీసులో ''కుప్పకూలిపోయాడు’’.
''ఆ వృద్ధుడిని పోస్టాఫీసుకు తీసుకువచ్చేటప్పటికే చనిపోయాడా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’’ అని ఆర్టీఈ వివరించింది.
పోస్టాఫీసుకు సమీపంలోని ఒక ఇంటిని నేర స్థలంగా గుర్తించినట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- పిల్లల ఆహారం విషయంలో తల్లులు చేసే నాలుగు తప్పులు
- 5G ఫోన్ల ద్వారా విమానాలకు ముప్పు ఎంత తీవ్రంగా ఉందంటే?
- ఒమిక్రాన్: 'బూస్టర్ డోస్’ ఎప్పుడు, ఎక్కడ, ఎలా తీసుకోవాలి? - 8 ప్రశ్నలకు సమాధానాలు
- భర్తతో సెక్స్కు నో చెప్పే హక్కు భార్యకు లేదా? మ్యారిటల్ రేప్పై ఎందుకు చర్చ జరుగుతోంది
- ఈ పండ్లను బంగారంలా చూస్తారు.. వీటి కోసం దొంగల ముఠాలు కాపు కాస్తుంటాయి
- చింతామణి నాటకాన్ని ఎందుకు నిషేధించారు, అడల్ట్ కామెడీగా మార్చడమే అసలు సమస్యా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications