షాకింగ్:ఫైజర్ వ్యాక్సిన్తో సైడ్ఎఫెక్ట్స్ -యూకే ప్రభుత్వ హెచ్చరిక -మాస్ వ్యాక్సినేషన్ వేళ కలకలం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా వ్యాక్సిన్ల వినియోగాన్ని ప్రారంభించిన బ్రిటన్ లో 24 గంటలైనా తిరక్కముందే కలకలం రేగింది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చోటుచేసుకుంటున్నట్లు స్వయంగా బ్రిటన్ ప్రభుత్వమే చెప్పింది. ఫైజర్ టీకాను తీసుకునే విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

మాస్ వ్యాక్సినేషన్ వేళ..
యూకే నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్), మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ)లు ఈ మేరకు బుధవారం కీలక ప్రకటనలు చేశాయి. ఫైజర్ సంస్థ తన జర్మన్ భాగస్వామి బయోఎన్ టెక్ తో కలిసి రూపొందించిన వ్యాక్సిన్ ను యూకే ప్రభుత్వం ప్రోయోగాత్మకంగా వినియోగానికి వాడుతోంది. మంగళవారం నుంచి ముందుగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు, ఫ్రంట్ లైన్ వారియర్లకు టీకాలను అందిస్తోన్న ఆ దేశం.. విడతలవారీగా మాస్ వ్యాక్సినేషన్(సామూహిక టీకాల పంపిణీ) కూడా చేపట్టేందుకు సిద్ధమవుతుండగా ఊహించని రీతిలో..

24 గంటల్లో ఇద్దరికి సైడ్ ఎఫెక్ట్స్
ఫైజర్ టీకాను బ్రిటన్ ఎన్హెచ్ఎస్ స్టాఫ్ కు అందించగా, వారిలో ఇద్దరికి సైడ్ ఎఫెక్ట్స్ బయటపడ్డాయి. వెంటనే స్పందించిన ప్రభుత్వం.. ఆ ఇద్దరినీ ఆస్పత్రిలోనే ఉంచి, ప్రత్యేక చికిత్స అందిస్తున్నది. ప్రయోగాత్మకంగా టీకా తీసుకున్న ఆ ఇద్దరికి ఒళ్లు దురద, వాంతులు, తలనొప్పి వంటి అలెర్జిక్ లక్షణాలు తలెత్తాయని, టీకా తీసుకున్న తర్వాత ఎవరికైనా ఇలాంటి లక్షణాలొస్తే తక్షణమే ఆస్పత్రుల్లో చేరాలని యూకే ప్రభుత్వం ప్రకటన చేసింది. అంతేకాదు, అలెర్జీ లక్షణాలున్నవారు టీకాను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అయితే..

ఎందుకిలా జరిగింది?
టీకా తీసుకున్న వాళ్లలో సైడ్ ఎఫెక్ట్ కు గురైన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఇలా ఎందుకు జరిగిందనేదానిపై ఫైజర్ సంస్థను వివరణ కోరామని, టీకా తయారీ దారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని బ్రిటన్ ఎన్హెచ్ఎస్ డైరెక్టర్ స్టీఫెన్ పోవిస్ మీడియాకు తెలిపారు. అలర్జీ కంప్లెయింట్స్ చరిత్ర ఉన్నవాళ్లెవరూ వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని ఫైజర్ సంస్థ సూచించిందని ఆయన చెప్పారు. ఫైజర్ వ్యాక్సిన్ సేఫ్టీ డేటాను మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామని, ప్రస్తుతానికి టీకాల పంపిణీ యధావిధిగా కొనసాగుతుందని స్టీఫెన్ పేర్కొన్నారు. కాగా,

40లక్షల మందికి ఫైజర్ వ్యాక్సిన్
ఇప్పటిదాకా అమెరికాలోనే ఆమోదం పొందని ఫైజర్ టీకాను బ్రిటన్ లో వాడేందుకు బోరిస్ సర్కారు అనుమతివ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మాస్ వ్యాక్సినేషన్లకు అనుమతిచ్చిన మొదటి దేశంగా బ్రిటన్.. మంగళవాంర నుంచే ప్రక్రియ మొదలుపెట్టింది. 90ఏళ్ల మార్గరెట్ కీనట్ తొలి వ్యాక్సిన్ డోసు తీసుకున్న ఫొటోలు వైరలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరిలోగా 40 లక్షల మందికి ఫైజర్ టీకాను అందించాలనుకుంటోన్న బ్రిటన్.. ఆ మేరకు పంపిణీ ఏర్పాట్లు కూడా చేసుకుంది. మొత్తం నాలుగు కోట్ల టీకాల కోసం బ్రిటన్ ఆర్డర్ పెట్టుకుంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications