మోడీ జీ: జర జోక్యం చేసుకోరాదు, రష్యాకు చెప్పరాదు.. ఉక్రెయిన్ అధ్యక్షుడి మొర
ఉక్రెయిన్పై రష్యా యుద్దానికి దిగింది. ఏకపక్షంగా యుద్ధ విమానాలను పంపించి.. బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ఉక్రెయిన్ స్నేహ హస్తం కోసం చూస్తోంది. ఇప్పటికే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రష్యాలో ఉన్నారు. యుద్దం.. ఇతర అంశాలపై డిస్కష్ చేస్తున్నారు. అయితే ఉక్రెయిన్ మాత్రం భారత్ జోక్యం చేసుకోవాలని కోరుతుంది.
Recommended Video
రష్యాతో భారత్ అనుబంధం ప్రత్యేకమైంది. భారత్- పాక్ ఘర్షణ సమయంలో అమెరికా పాక్ వైపు నిలబడితే.. రష్యా భారత వైపున నిలుచుంది. ఈ క్రమంలో భారత్ చెబితే రష్యా వింటుందని ఉక్రెయిన్ భావిస్తోంది. ఇరుదేశాల మధ్య అనుబంధం ఉండటంతో.. ఇండియా మాటకు రష్యా గౌరవం ఇస్తోందని అభిప్రాయపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే జోక్యం చేసుకోవాలని ఉక్రెయిన్ కోరుతుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడాలని అడుగుతుంది. ఈ మేరకు తమ అధ్యక్షుడు జెలన్స్కీ కోరారని భారత్లో ఉక్రెయిన్ రాయబరి ఇగొర్ పొలిఖా పేర్కొన్నారు.

అయితే రష్యా- ఉక్రెయిన్ యుద్దంపై భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. ఏ దేశం వైపు నిలవబోమని కుండబద్దలు కొట్టింది. కానీ శాంతిని పునరుద్దరించేందుకు చర్యలు మాత్రం తీసుకోవాలని కోరుతుంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ మధ్యవర్తిత్వం వహించాలని కోరడం విశేషం. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను దేశం తీసుకురావడంపై దృష్టిసారించామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. వారి కోసం 24 గంటలపాటు అందుబాటులో కంట్రోల్ రూమ్ ఉంటుందని వివరించింది.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ రాయబారి సెర్గీ కిస్లిట్యా తీవ్రంగా ఖండించారు. ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ నాయకత్వం నుంచి రష్యా తప్పుకోవాలని డిమాండ్ చేశారు. యుద్ధాన్ని ఆపేందుకు ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ను అత్యవసరంగా సమావేశపరచాలని కోరారు. ఉద్రిక్తతల గురించి చర్చించే సమయం మించిపోయిందని.. ఇప్పుడు యుద్ధాన్ని ఆపే మార్గాలపై చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒకప్పుడు సోవియెట్ రష్యాలో భాగమైన ఉక్రెయిన్ ఇప్పుడు యురోపియన్ యూనియన్కు దగ్గరవడం రష్యాకు ఏమాత్రం మింగుడుపడట్లేదు. ఉక్రెయిన్ని తమతో చేర్చుకోమని హామీ ఇవ్వాల్సిందిగా అమెరికా, నాటోని డిమాండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్ నాటో పక్షం చేరవద్దని.. అది తటస్థంగానే ఉండాలని అంటున్నారు. పశ్చిమ దేశాలు పుతిన్ డిమాండ్లను తిరస్కరిస్తున్నాయి. ఉక్రెయిన్ ద్వారా పశ్చిమ దేశాల నుంచి రష్యాకు ముప్పు ఉంటుందని పుతిన్ భావిస్తున్నారు. ఉక్రెయిన్పై దాడికి పూనుకున్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications