US-India Trade Talks: దిమ్మతిరిగేలా భారత్ ఆఫర్లు..! అమెరికా హ్యాపీ..!
భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లో ఊహించని పురోగతి లభిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, రష్యా చమురు కొనుగోళ్ల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గ్యాప్ పెరిగింది. దీని ప్రభావంతో అమెరికా భారత్ పై 50 శాతం సుంకాలు కూడా విధించింది. దీంతో భారత్ వీటని తగ్గించాలని అమెరికాను పదే పదే కోరుతోంది. అయినా ఇప్పటికీ సానుకూల ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు భారత్ భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు వాణిజ్య చర్చల్లో పాల్గొంటున్న ఆ దేశ అధికారి ఒకరు వెల్లడించారు.
భారత్ తో జరుగుతున్న వాణిజ్య చర్చలు పురోగతి సాధించినట్లు అమెరికా వాణిజ్య వ్యవహారాల ప్రతినిధి జామిసన్ గ్రీర్ చట్టసభ సభ్యులకు వివరించారు. ముఖ్యంగా ధాన్యం, జొన్న, సోయాతో సహా అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్ను విస్తరించే లక్ష్యంతో జరుగుతున్న చర్చలలో భారత్ .. ఒక దేశంగా మనం ఇప్పటివరకు అందుకున్న ఆఫర్లలో అత్యుత్తమమైనది ఇచ్చినట్లు వెల్లడించారు. సున్నితమైన వ్యవసాయ అడ్డంకులను అధిగమించడానికి పనిచేస్తున్న అమెరికా వాణిజ్య సంబంధాల బృందం ప్రస్తుతం ఢిల్లీలో ఉందన్నారు.

భారత్ తాజా ప్రతిపాదనలు అసాధారణ ప్రారంభాన్ని సూచిస్తున్నాయని గ్రీర్ వెల్లడించారు. అమెరికన్ ఉత్పత్తిదారులు పేరుకుపోతున్న నిల్వలు, చైనా నుండి హెచ్చుతగ్గుల డిమాండ్ను ఎదుర్కొంటున్న సమయంలో భారత్ ఇప్పుడు తమ వస్తువులకు ఆచరణీయమైన ప్రత్యామ్నాయ మార్కెట్ అన్నారు. వీటి వాణిజ్యం కోసం మనం ఒక మార్గాన్ని కనుగొనాలని తెలిపారు. భారత్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ అక్కడి మార్కెట్ చారిత్రాత్మకంగా కష్టమైందన్నారు.
ఆగ్నేయాసియా, యూరప్ వంటి ప్రదేశాలలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ యాక్సెస్ తెరుస్తున్నామని గ్రీర్ చట్టసభకు తెలిపారు. ఈ కొత్త అవకాశాలు, భారత్ వంటి ప్రధాన భాగస్వాములతో వాషింగ్టన్ సంబంధాల్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. అలాగే రైతులు నిర్మాణాత్మక స్థిరమైన యాక్సెస్ పొందడంలో సాయపడతాయన్నారు. వ్యవసాయేతర రంగాలలో భారత్ తో విస్తృత సుంకం, మార్కెట్-యాక్సెస్ సమస్యలు తలెత్తుతాయని గ్రీర్ తెలిపారు. 1979 విమాన ఒప్పందం ప్రకారం పౌర విమానయాన భాగాలకు జీరో-టారిఫ్ నిబద్ధతల భవిష్యత్తు గురించి అడిగినప్పుడు, భారతదేశంతో చర్చలు చాలా ముందుకు సాగాయన్నారు.

అస్థిర సుంకాలు, మారుతున్న చైనా కొనుగోళ్ల మధ్య అమెరికన్ రైతులు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేయగా...పరస్పర ఒప్పందాల కోసం ట్రంప్ ప్రభుత్వ ఒత్తిడి ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తోందని గ్రీర్ తెలిపారు. గత దశాబ్దంలో భారతదేశం-అమెరికా వాణిజ్య సంబంధాలు గణనీయంగా విస్తరించాయన్నారు. రెండు ప్రభుత్వాలు వ్యవసాయం, డిజిటల్ సేవలు, విమానయానం, ఔషధాలు, కీలకమైన ఖనిజాలలో మార్కెట్ యాక్సెస్ కోసం చర్చలు జరుపుతున్నాయని వెల్లడించారు.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి.. -
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
వేసవిలోనూ ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని తాగుతున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా? -
Adani Total Gas: గృహ వినియోగదారులకు ఊరట.. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గింపు -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications