కాబూల్ యూఎస్ దాడి దర్యాప్తులో సంచలనం-పిల్లల ఆనవాళ్లు మాయం, కుట్రకూడా లేదట
ఈ ఏడాది ఆగస్టు 29న కాబూల్ పై యూఎస్ సైన్యం జరిపిన డ్రోన్ దాడిలో భారీగా పౌరులు చనిపోయారు. ఇందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ దీనిపై జరిగిన దర్యాప్తు తాజాగా పూర్తయి నివేదిక వచ్చింది. ఇందులో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి.
కాబూల్ పై యూఎస్ జరిపిన డ్రోన్ దాడిలో పౌరులు చనిపోవడం నిజమే అయినా చిన్నారులు మాత్రం లేరని దర్యాప్తు నివేదిక వెల్లడించింది. అలాగే ఈ దాడిలో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని కూడా దర్యాప్తు తేల్చింది. యూఎస్ మిలిటరీ ఇన్ స్పెక్టర్ జనరల్ నిర్వహించిన ఈ దర్యాప్తులో పలు సంచలన అంశాలు దర్శనమిచ్చాయి. గతంలో ఈ దాడి తీవ్రమైన పొరబాటుగా చెప్పిన యూఎస్ అధికారులు.. ఇప్పుడు మాత్రం ఇందులో ఎలాంటి కుట్ర లేదని తేల్చారు. కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఐసిస్ ఆత్మాహుతి దళ సభ్యుడిని టార్గెట్ చేసుకుని మాత్రమే ఈ దాడి జరిగినట్లు పెంటగాన్ పేర్కొంది. ఈ దాడికి ముందు ఐసిస్ జరిపిన దాడిలో 10 మంది యూఎస్ సైనికులు చనిపోయారని, దానికి ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లు ప్రకటించింది.

యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనరల్ చేసిన దర్యాప్తు ప్రకారం, దాడి అమలులో లోపాలు, నిర్దిష్ట దృక్కోణాలకు మద్దతు ఇచ్చే సమాచారాన్ని వివరించడం, కమ్యూనికేషన్ బ్రేక్డౌన్ల కారణంగా ఇది చోటు చేసుకున్నట్లు తన నివేదికలో తెలిపారు.
ఇది విచారించదగిన తప్పని, ఇది నిజాయితీగల తప్పని కూడా ఎయిర్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సమీ తాజాగా మీడియాకు వివరించారు. దీంతో కాబూల్ ఎయిర్ పోర్టు బయట తాము చేసిన దాడిని అమెరికా మరోసారి సమర్ధించుకున్నట్లయింది. గతంలో ఈ దాడిని పొరబాటుగా పేర్కొన్న యూఎస్ సైన్యం.... ఇప్పుడు మాత్రం ఇందులో కుట్ర లేదని చెప్పడం ద్వారా దాడి సమంజసమేనని చెప్పినట్లయింది.
-
Iran War: ట్రంప్ సీజ్ ఫైర్ ప్లాన్ పై తేల్చేసిన ఇరాన్- కీలక ప్రకటన..! -
H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా...! -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications