పెళ్లి పార్టీలో గ్యాంగ్ వార్: 21 మంది అంతం
కాబూల్: పెళ్లి జరిగిన ఇంటికి విందుకు వెళ్లిన 21 మంది బంధువులు తుపాకి తూటాలకు బలి అయిన సంఘటన అఫ్ఘనిస్థాన్ లో జరిగింది. కాబూల్ నగరం సమీపంలోని ఒక గ్రామంలో ఒక పెళ్లింట ఈ దారుణ సంఘటన జరిగింది.
కాబూల్ నగరం సమీపంలోని దెహస్లా గ్రామంలో ఆదివారం పెళ్లి జరిగింది. పెళ్లికి బంధువులు వెళ్లారు. పెళ్లి జరిగిన తరువాత ఎర్పాటు చేసిన విందులో చిన్న గొడవ జరిగింది. ఆ సందర్బంలో ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి విషమించింది.

అంతే రెండు వర్గాల వారు పరస్పరం తుపాకులతో కాల్పులు జరుపుకున్నారు. ఈ దాడులలో 14 నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న 21 మంది సంఘటనా స్థలంలో మరణించారని సీనియర్ పోలీసు అధికారి గులిస్థాన్ క్వుసాని చెప్పారు.
ఈ దాడిలో 10 మంది గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. చాల సంవత్సరాల నుండి రెండు వర్గాల మద్య గొడవలు జరుగుతున్నాయని, పెళ్లి విందులో పగ తీర్చుకోవడానికి ప్రయత్నించి పరస్పరం కాల్పులు జరుపుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications