బుర్జ్ ఖలీఫాకి డబుల్: టోక్యోలో స్కైమైల్ ఆకాశహర్మ్యం
టోక్యో: ఇప్పటి దాకా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా. ఆ భవనాన్ని తలదన్నే విధంగా జపాన్లోని టోక్యోలో 'స్కై మైల్ టవర్' పేరుతో ఓ ఆకాశహర్మ్యాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. బుర్జ్ ఖలీఫా భవనానికి రెండింతల ఎత్తయిన ఈ భవనాన్ని టోక్యో బేలో నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు.
షడ్భుజి (ఆరు మూలలు) ఆకారంలో ద్వీపాలలో నిర్మించే భవనాల సమూహాలకు ఆమోదం లభిస్తే ప్రపంచంలోనే ఎత్తైన ఆకాశహర్మ్యంగా స్కై మైల్ టవర్ నిలిచిపోతుంది. ఈ భవనాన్ని 2045 వరకు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ భవనంకు ఆమోదం లభిస్తే... ఈ స్కై మైల్ టవర్ను 5,577 అడుగుల ఎత్తు నిర్మించనున్నారని తెలుస్తోంది. ఇది బుర్జ్ ఖలీఫాకు రెండంతలు ఉంటుంది. బుర్జ్ ఖలీఫా 2,717 అడుగులు ఉంది.












Click it and Unblock the Notifications