ఘోరం: మంత్రాల నెపంతో అందరూ చూస్తుండగానే తండ్రి, ఇద్దరు కుమారులను పొడిచి చంపారు
కరీంనగర్: ఓ వైపు ప్రపంచం శాస్త్రసాంకేతిక రంగాల్లో అనేక విజయాలను సాధిస్తూ ఆధునిక పోకడలను అనుసరిస్తుంటే.. మరోవైపు పలు ప్రాంతాల్లో మూఢనమ్మకాలు అమాయకుల ప్రాణాలను తీస్తున్నాయి. జగిత్యాలలో మంత్రాల నెపంతో ఓ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరగడం గమనార్హం.
Recommended Video

అందరూ చూస్తుండగానే తండ్రీకొడుకుల హత్య
జగిత్యాలలో జరిగిన హత్యల ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగన్నాథం నాగేశ్వర్రావు(60) కుటుంబంతో కలిసి ఎరుకలవాడలో ఉంటారు. కుమారుల కుటుంబాలు కూడా సమీపంలోనే ఉంటాయి. ఆరు నెలలకోసారి స్థానికంగా కులసంఘం సమావేశం ఉండటంతో గురువారం ఆయనతోపాటు పెద్దకొడుకు రాంబాబు(35), రెండో కుమారుడు రమేశ్(25), మూడో కుమారుడు రాజేశ్ వెళ్లారు. అక్కడే మహిళలు వేరేగా సమావేశం నిర్వహించుకుంటున్నారు. నాగేశ్వర్రావు, ఆయన కుమారుల కుటుంబాలకు చెందిన మహిళలు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు.
అప్పటికే కుల సంఘం సమావేశంలో కాచుకు కూర్చున్న కొందరు.. ఒక్కసారిగా నాగేశ్వర్రావు.. ఆయన ముగ్గురు కుమారులపై కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకునేలోపే ఇద్దరు రక్తపు మడుగులో అచేతనంగా పడిపోగా మరొకరు తీవ్రగాయాలతో విలవిల్లాడిపోతూ కనిపించడం చూసి గుండెలవిసేలా రోదించారు వారి కుటుంబసభ్యులు. నాగేశ్వర్రావు, రాంబాబులను ఛాతి, గొంతు భాగంలో బలంగా పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయారు. తీవ్రంగా గాయపడిన రమేశ్ను జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.

మంత్రాల నెపంతోనే దారుణ హత్యలు
కాగా, నాగేశ్వర్ రావు మరో కుమారుడు రాజేశ్ దుండగుల దాడి నుంచి తప్పించుకుని పరుగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆరుగురికిపైగా వ్యక్తులు ఈ దారుణంలో భాగమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పక్కాగా ప్రణాళికపక్కా ప్రణాళిక ప్రకారమే హంతకులు ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే వారు సంఘ సమావేశానికి హాజరై అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ఆయుధాలతో తెగబడ్డారని భావిస్తున్నారు. నాగేశ్వర్రావు కుటుంబంతో కొన్నాళ్లుగా వైరం ఉన్న వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, ముఖ్యంగా మంత్రాల నెపంతోనే ఈ ఘోరానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎరుకల వాడలో కుల పెద్దగా ఉంటున్న నాగేశ్వర్రావు సహా ఆయన కుటుంబీకులు మంత్రాలు చేస్తున్నారని కొంతమందిలో అనుమానాలున్నాయి. నెలరోజుల కిందట సిరిసిల్ల జిల్లా ఆగ్రహారం సమీపంలోని ఓ శ్మశాన వాటిక వద్ద ఈ కారణంగానే నాగేశ్వర్రావుపై దాడి జరిగింది. కేసు కూడా నమోదైంది. వారం రోజుల కిందట ఎరుకల వాడలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె మృతికి వీరు చేస్తున్న మంత్రాలే కారణమని భావించిన వైరివర్గాలు ఈ హత్యలకు పాల్పడి ఉంటారేమోనని పోలీసులు సందేహిస్తున్నారు.

ముగ్గురి హత్య కేసులో 8 మందిపై ఎఫ్ఐఆర్.. పలువురి అరెస్ట్
కాగా, నాగేశ్వర్రావు భూముల క్రయవిక్రయాలు, వడ్డీ వ్యాపారం చేస్తారు. ఆయనకు ఇద్దరు భార్యలు- సుఖమ్మ, కనుకమ్మ. రాంబాబుకు భార్య సారమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, రమేశ్కు భార్య సౌజన్య ఉన్నారు. మృతిచెందిన అన్నదమ్ములిద్దరు సెప్టిక్ ట్యాంకును నడిపిస్తూ జీవనాన్ని సాగిస్తుండేవారు. కాగా, జగిత్యాలలో ముగ్గురి హత్య కేసులో 8 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వనం దుర్గయ్య, చిన్న గంగయ్య, మధు, పోచయ్య, శేఖర్, కందుల రాములు, పల్లాని భూమయ్య, కందుల శ్రీనుపై కేసు నమోదయింది. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. జగిత్యాలలో మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్త్ చేపట్టారు. టీఆర్నగర్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇది ఇలావుండగా, జనగామ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తీగారంలోని కాషాగూడెంలో బుధవారం రాత్రి మంత్రాల నెపంతో ముగ్గురిపై దాడి చేశారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications