కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీకి 130 స్థానాలు గ్యారెంటీ .. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది అంటున్న కాటసాని

|
Google Oneindia TeluguNews

చంద్రబాబు టార్గెట్ గా విమర్శల వర్షం కురిపిస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు టార్గెట్ గా మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమన్నారు వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి . కర్నూలు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రాంభూపాల్ రెడ్డి మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 130 స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. వైసీపీ ప్రకటించిన నవరత్నాలు పథకాలు ప్రజలను ఆకర్షించాయని రాంభూపాల్ రెడ్డి చెప్పారు .

టీడీపీ నేత శేఖర్ రెడ్డి హత్యపై తీవ్రంగా స్పందించిన మంత్రి నారా లోకేష్ .. ఏమన్నారంటేటీడీపీ నేత శేఖర్ రెడ్డి హత్యపై తీవ్రంగా స్పందించిన మంత్రి నారా లోకేష్ .. ఏమన్నారంటే

130 seats guarantee for the YCP .. Chandrababu is in the fear of defeat Katasani said

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నారని వైసీపీ పాణ్యం అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. అందుకే చంద్రబాబు ప్రస్తుతం ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. లగడపాటి రాజగోపాల్ సర్వేను ప్రజలు నమ్మరని తేల్చిచెప్పారు. వైఎస్ జగన్ నాయకత్వంలోనే ఏపీకి న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. జగన్ సీఎం అవుతారని జాతీయ సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

English summary
YCP leader Katasani ram bhupal reddy criticized Chandrababu for failing to get the results of the Exit Poll in the AP in favor of the YCP. katasani spoke to the media and fired on Chandrababu criticized that Telugu Desam Party defeat in this election .In the AP Assembly polls, the YCP will be honored in 130 seats. Ramabhupal Reddy said that the Nava rathnalu schemes announced by the YCP were attracting people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X